మనం రోజుకో అనర్ధాలను చూడడం మనకు పరిపాటిగా మారింది. వీటిలో ఎక్కువుగా అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు లాంటి వంటివి చాల ఎక్కువనే చెప్పాలి. మిగితావి మోసం చేయడం వాటి కోవలోకి వస్తాయి. ఇలాంటి విషయమే మన తెలుగు రాష్ట్రాలలో మరొకటి జరిగింది. ఇక ఆసలు విషయానికి వస్తే రెండేళ్ల క్రితం పెళ్లయిన ఒక యువకుడు, తాజాగా మరో యువతిని ప్రేమ పేరుతో వెంటపడి రెండో పెళ్లి చేసుకున్న ఘటన హైదరాబాద్‌ లో వెలుగు చూపింది. ఇద్దరు మహిళల జీవితాలను నాశనం చేసిన ఆ ప్రబుద్ధుడు ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు.


ఇక పూర్తి వివరాలలోకి వెళితే వరంగల్‌ జిల్లా పరకాల మండలానికి చెందిన పొలిపాక కార్తీక్ (23) కొన్ని ఏళ్ల క్రితం కుటుంబంతో కీసర మండలం దమ్మాయి గూడ లోని ఇందిరా గృహ కల్ప ప్రాంతానికి వచ్చాడు. 2017 సంవత్సరంలో అదే ప్రాంతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. నేరేడ్‌ మెట్‌ ప్రాంతానికి చెందిన ఒక యువతితో అతడికి ఆరు నెలల క్రితం పరిచయమైంది. తనకు పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన కార్తీక్ ఆమెతో ప్రేమాయణం మొదలు పెట్టాడు. 20 రోజుల క్రితం ఆమెను వైజాగ్‌ తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకుని కొద్ది రోజులు గడిపాడు.


కార్తీక్ తనకు అసలు విషయం తెలియకుండా తరుచూ ఫోన్ మాట్లాడటంతో అనుమానం వచ్చిన ఆ యువతిని నిలదీయగా తనకు గతంలోనే పెళ్లి జరిగిందని చెప్పాడు. దీనితో యువతి నేరేడ్‌ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కార్తీక్‌ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిజం ఎప్పటికి కప్పి పెట్టలేము అంటే ఇదేనెమో. కాబట్టి ఏదైనా పాడు పని చేసేముందు ఒకటికి రెండు సార్లు అలోచించి ఆ పనిని విరమించుకుంటే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: