గత కొన్ని రోజులుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపి టిడిపి పార్టీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్సీ  లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ ను  జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తూ  వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు  చేసిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు నారా లోకేష్ కు ఎలాంటి పొంతన లేదని నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టు వల్లభనేని వంశీ విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పటివరకు  మాత్రం టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం స్పందించలేదు. అయితే తాజాగా దీనిపై టిడిపి సీనియర్ నేత పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.


తమకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని  తమ నాయకుడు చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి కొడాలి నాని టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వర్ల  రామయ్య . ఇటీవల టీడీపీ పార్టీపై విమర్శలు చేసిన  గన్నవరం ఎమ్మెల్యే వంశీ... జూనియర్ ఎన్టీఆర్ టిడిపి ఎందుకు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన వర్ల రామయ్య 2009 ఎన్నికల్లో జరిగిన పరిణామాల గురించి ఇప్పుడు మాట్లాడడం ఎందుకంటూ  సమాధానం దాటవేశారు. 



 టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం  లేదని టీడీపీ అధినేత చంద్రబాబు టిడిపిని కాపాడుకుంటారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాష్ట్రంలో జగన్ అవినీతికి పాల్పడుతున్నారు అంటూ వర్ల రామయ్య విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఇదిలా ఉండగా  గత కొన్ని రోజులుగా వల్లభనేని   టిడిపి పార్టీపై  తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. టిడిపి నేతలు మాత్రం వంశీ వ్యాఖ్యలను  తప్పు పడుతున్నారు. కాగా  ప్రస్తుతం వల్లభనేని వంశీ వ్యాఖ్యలు  ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి.  వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: