రాజీనామా చేస్తాను చేస్తాను అని చెబుతున్న
వల్లభనేని వంశీ ఎందుకు చేయడం లేదంటూ
నారా లోకేష్ ప్రశ్నించారు. వల్లభనేని వంశీకి భయం ఉందని... అందుకే
టిడిపి పార్టీకి
రాజీనామా చేయడం లేదంటూ
నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఒకవేళ
ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తానో లేదో అని వంశీకి భయం పట్టుకుందని అందుకే
రాజీనామా చేయడం లేదని లోకేష్ విమర్శించారు.
వల్లభనేని వంశీ రోజుకో మాట మారుస్తున్నాడు అంటూ
లోకేష్ ఆరోపించారు.
టిడిపి పార్టీ నుంచి ఒకరిద్దరు నేతలు వెళ్లిపోయిన అంతమాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం కలుగదు నారా లోకేష్ స్పష్టం చేశారు.
టిడిపి నుంచి నేతలు వెళ్లిపోయిన కార్యకర్తలు పోరాడుతామని
టిడిపి పార్టీకి అండగా నిలబడతారని చెప్పారు నారా లోకేష్.
వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం అంటూ
లోకేష్ వ్యాఖ్యానించారు. పార్టీలోకి ఎంతో మంది నేతలు వస్తుంటారు పోతుంటారు
వంశీ లాంటి నేతలు వెళ్లిపోయిన పార్టీకి పెద్ద నష్టం లేదని స్పష్టం చేసారు నారాలోకేష్. ఇన్ని మాటలు మాట్లాడే వంశీ ఓ కార్యకర్త చనిపోతే వచ్చారా పట్టించుకున్నారా అంటూ
లోకేష్ నిలదీశారు.
2019 ఎన్నికల ముందు
వల్లభనేని వంశీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టారో అందరికీ తెలుసన్నారు. మళ్లీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి
జగన్ ని పొగుడుతున్నారు అంటూ
నారా లోకేష్ వ్యాఖ్యానించారు.