అడవిలో జంతువులకు స్వేచ్చవచ్చినట్లుగా ఉంది ఎందుకంటే వాటిలో కౄరత్వము తగ్గి పోయినటుగా అనిపిస్తుంది. వాటి లక్షణాలన్ని వాటినీ వదిలి మనిషిలో చేరాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో మనిషి ప్రవృత్తి పశువు, జంతువు కంటే హీనంగా మారింది. నమ్మకంతో అదును చూసి తన కామ పంజా విసురుతున్నాడు. ఆడపిల్లల బ్రతుకుల్ని బజారు పాలు చేస్తున్నాడు. ఎవ్వరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్దితుల్లో ఆడపిల్లల బ్రతుకులు మారుతున్నాయి.


ఇప్పుడు కోరికకు వయస్సుతో పనిలేదు. ఎదిగి ఎదుగని వయస్సు నుండే దేహంలో కోరికలు పుడుతున్నాయని గ్రహించుకుంటూ ఆ కోరికను ఎలా తీర్చుకోవాలో ఫోర్న్ సైట్స్ లో చూస్తూ కామ వాంఛను పశువాంఛలా మార్చుకుని అతి నీచానికి పాల్పడుతున్నాడు మనిషి అని చెప్పుకునే వానర జాతికి చెందిన మానవుడు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే జరిగింది. 16 సంవత్సరాల వయస్సు కలిగిన బాలుడు తన మరదలిని పశువుకంటే హీనంగా అనుభవించాడు.


ఇదేనా అతని తల్లి దండ్రులు నేర్పించిన సంస్కారం అని అనుకోవలసిన విధంగా ఆ బాలిక పట్ల ప్రవర్తించాడు. పూర్తి వివరాలు తెలుసుకుంటే  దేశ రాజధాని ఢిల్లీలోని గురుగ్రామ్‌లో ఓ  16ఏళ్ల ఓ బాలుడు తనకు మరదలు వరుసయ్యే 15ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి అత్యంత నీఛంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 51 ఏరియాలోజరిగిన ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.


ఇంతకు విషయం బయటకు ఎలా వచ్చిందంటే స్కూల్‌కు వెళ్లిన ఆ బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో టీచర్ ఆమెను విచారించింది. దీంతో జరిగిన ఘటనను ఆమెకు వెల్లడించింది. సదరు టీచర్ బాలిక తల్లికి అసలు విషయం చెప్పడంతో..వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనిషి ఎలా తయారైయ్యాడంటే వేళకాని వేళలలో లేనిపోని వాంఛలతో దారికాని దారులలో కానరాని కాంక్షలతో కామతో ఆడదానికై పదేపదే దేవులాడుతున్నాడు. ఈ సమాజంలో మనుషులను ఇలాగే వదిలేస్తే ముందు ముందు సమాజంలో మనుషులు మిగలరు. మృగాలే సంచరిస్తుంటాయి. నమ్మకానికున్న విలువ కూడా తగ్గి అప్పుడు మనిషి తన నీడను తానే నమ్మలేని భయంకర పరిస్దితులు నెలకొంటాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: