చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలయ్యారు.  ఈ ఓటమి తరువాత బాబుగారు తన పార్టీ సభ్యులను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.  పార్టీ నుంచి బయటకు వెళ్తున్న నేతలు డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. వల్లభనేని వంశి సైతం పార్టీ నుంచి బయటకు వచ్చి చేసిన వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి.  ఈ ఐదేళ్లు బాబుకు ప్రతిపక్షంలో కూర్చోక తప్పదు.  


అయితే, అధికారం లేకుంటే బాబుకు తెలియని అసహనం ఏర్పడుతుంది.  ఎవరు ఏ చిన్న మాట అన్నా పెద్దగా రియాక్ట్ అవుతుంటాడు.  ప్రతిపక్షంలో కూర్చోవడం తెలుగుదేశం పార్టీకి కొత్తేమి కాదు.  కాకపోతే, జగన్ వంటి యువనేత ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో కూడా బాబు ప్రతిపక్షంలో ఉన్నాడు .. అదే బాబుగారికి ఇబ్బంది కలిగించిన అంశంగా మారింది.  


ఇక ఇదిలా ఉంటె, ఆధ్యాత్మిక విషయంలో బాబుగారు పెద్దగా పట్టించుకోరు.  ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వెళ్తే నాలుగు ముక్కలు మాట్లాడతారు.  నిన్నటి రోజున జరిగిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా వచ్చారు.  బాబు ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు.  బాబుకు.. కోటి దీపోత్సవం ఛానల్ చైర్మన్ కు మంచి అనుబంధం ఉన్నది. అందుకే బాబు తప్పకుండా వస్తుంటారు.  


అయితే, ఇలా వచ్చిన బాబుగారిని పూరి మఠం స్వామీజీ ఆశీర్వదించారు.  వేదికమీద బాబుగారి చెవిలో ఎదో విషయాన్నీ చెప్పారు.  చెవిలో అయన చెప్తుండగా దానిని బాబుగారు శ్రద్దగా వింటున్నారు.  ఇంతకీ బాబుగారికి చెప్పిన మాట ఏంటి.. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొంచం జాగ్రత్తగా ఉండాలని చెప్పారా లేదంటే.. త్వరలోనే అధికారం మరలా చేతికి వస్తుందని చెప్పారా..?ఏం చెప్పారు అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.  పూరి స్వామిజీ చెప్పిన మాటలు ఏంటి అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: