వైఎస్ఆర్సీపీలో చేరతానని ప్రకటించిన గన్నవరం వల్లభనేని వంశీ ఎపిసోడ్‌ రేపిన కాక కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల్ని టార్గెట్ చేసిన వంశీ తాను టీడీపీని వీడితే నష్టం లేదని.. లోకేశ్ ఉంటేనే నష్టమని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో పప్పు ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. టీడీపీకి లోకేశ్ ఓ పెద్ద గుదిబండ, స్పీడ్ బ్రేకర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు...


జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. తారక్‌ను చంద్రబాబు వాడుకొని వదిలేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలకు టీడీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. తర్వాత మంత్రి కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రస్తావించడంతో మళ్లీ టీడీపీలోతాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. మంత్రి కొడాలి, వల్లభనేని వంశీ వ్యాఖ్యలకు కౌంటరిస్తూ.. తారక్‌పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


‘మాకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. మా నాయకుడు చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్’అన్నారు. వర్ల చేసిన ఈ వ్యాఖ్యలు మళ్లీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. అలాగే బూతులు మాట్లాడిన వ్యక్తిని ఎలా మంత్రి చేశారంటూ మంత్రి కొడాలిపై విరుచుకుపడ్డారు. దేవినేని ఉమా తల్లిదండ్రులకు నాని క్షమాపణలు చెప్పాలన్నారు. ఆయన ఏపీ రాజకీయ చరిత్రలో బూతుల మంత్రిగా నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.


చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివానన్న వల్లభనేని వంశీ.. ఇప్పుడు జగన్ స్క్రిప్టు ఇస్తే చదువుతున్నారా అంటూ ప్రశ్నించారు వర్ల రామయ్య. సామాన్య స్కూల్ మాస్టర్ కుమారుడైన వంశీకి అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ఇక చంద్రబాబు ఒక సామాన్య కుటుంబంలో జన్మించారని.. ఆయన తండ్రి ఖర్జూర నాయడికి, బాబుకు వంశీ క్షమాపణలు చెప్పాలన్నారు. లోకేష్ తెలుగు చదవలేక రెండు తప్పులు చదివితే ఇష్టమొచినట్లు నిక్ నేమ్‌లు పెట్టారని.. ముఖ్యమంత్రి అయిన జగన్ నిరక్షరాస్యత అనే మాట అనే లేకపోయారని ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: