రోజు రోజు కి మనిషిలో పైశాచికత్వం పెచ్చుమీరుతోంది. ఒక అమాయకపు మైనర్ బాలిక పై 8 మంది దుర్మార్గులు 3 రోజుల పాటు అత్యాచారాన్ని చేశారు. ఆటో లో తీసుకువెళ్లి ఒకేసారి నలుగురు ఆ పసి ప్రాణంపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలిక తల్లితండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 మంది నిందితులని
అరెస్ట్ చేశారు.
ఈ విషాదకర సంఘటన
భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా మణుగూరు పట్టణంలో చోటు చేసుకుంది. గత నెల 27న బాలిక తన తల్లికి పరిచయస్తుడైన దుమ్ముగూడెం మండలం రామారావుపేట గ్రామానికి చెందిన పూజారి కల్యాణ్కు భద్రాచలం వస్తున్నానని ఫోన్ నుంచి మెస్సేజ్ పంపింది. అక్కడ బాలికను రిసీవ్ చేసుకున్న
కళ్యాణ్ బాలికను బైక్పై తన ఇంటికి తీసుకెళ్లి
ప్రేమ పేరుతో లోబరుకుని శారీరకంగా అనుభవించాడు.
28వ తేదీన భద్రాచలం బస్టాండ్లో బస్సు ఎక్కించాడు. మణుగూరుకు చేరుకున్న బాలిక తన చిన్ననానమ్మ గ్రామమైన గంగోలు వెళ్లేందుకు ముత్తారపు వెంకటేష్
ఆటో ఎక్కింది. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న
వెంకటేష్ ఆమెను దారి మళ్లించి పర్ణశాలకు తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు ఆమెను అక్కడే తిప్పి రాత్రివేళ రెడ్డిపాలెం వెళ్లే దారిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆటోలోనే అత్యాచారం చేశాడు.
ఆ బాలిక కేకలు వెయ్యడం తో అదే ప్రాంతానికి చెందిన సందెళ్ల రామాపురం గ్రామానికి చెందిన సోడె రాంబాబు ఏలియాస్ బాబు, పొడియం సాయి, తెల్లం
కృష్ణ, ఆంతోటి
ప్రశాంత్, వినయ్
ఆటో వద్దకు వచ్చారు. వెంకటేష్ను బంధించి ఒకరి తర్వాత ఒకరు బాలికను పైశాచికంగా అనుభవించారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తాం అని బెదిరించారు.
మరుసటి రోజు ఇద్దరూ భద్రాచలం బయలుదేరగా.. రాత్రి అత్యాచారం చేసిన వారిలో ఒకడు వెంబడించాడు. వెంకటేశ్ ఆటోను దారి మళ్లించి చివరకు భద్రాచలం బస్సు ఎక్కించాడు. బాలిక భద్రాచలం చేరుకుని కల్యాణ్కు
ఫోన్ చేయగా అతడు మళ్లీ ఆమెను ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా 3 రోజులు పాటు బాలిక పై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన బాలిక ను తల్లి 3 రోజుల పాటు ఎక్కడికి వెళ్లవు అంటూ మందలించడం తో బాలిక జరిగినది అంతా తల్లి తో చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.