చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళలు ఒంటరిగా ఉండాలంటేనే భయపడిపోతున్నారు. ఈ భయం రోజు రోజుకు పెరిగిపోతున్నది.  మహిళలు కనీనం ఇంట్లో ఒంటరిగా ఉండాలని భయపడుతున్నారు.  ఇంట్లో మహిళలు ఒంటరిగా ఉంటె చాలు.. వాళ్ళను ఏదో విధంగా లొంగదీసుకుని అనుభవించాలని చూస్తున్నారు కామాంధులు.  వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోతున్నది. 


చిత్తూరులో ఘటన మరవక ముందే తమిళనాడులోని శివగంగలో ఓ దారుణం జరిగింది. శివగంగలో ఉండే ఓ వివాహిత భర్త కొన్నాళ్ల క్రితం ఉపాధికోసం విదేశాలకు వెళ్ళాడు.  దీంతో ఆమె ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నది.  ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమయించిన హరీష్ అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.  ఇంటిపనులు చేస్తూ నమ్మకంగా ఉన్నాడు.  అతనిపై ఆమెకు నమ్మకం పెరిగింది.  ఆ నమ్మకంతో ఇద్దరు కలిసి మెలిసి తిరిగేవారు.  కానీ, ఆమెను వంచిస్తున్నాడు అని ఆమె తెలుసుకోలేకపోయింది.

ఓరోజు ఆమెను తన ఇంటికి పిలిచి అతిధి మర్యాదలు చేశాడు.  ఆ తరువాత చాక్లెట్లో మత్తుమందు కలిపి ఇచ్చాడు.  చాక్లెట్ తిన్న ఆ మహిళ మత్తులోకి జారుకుంది.  అలా ఆమె మత్తులోకి వెళ్లిన తరువాత ఆమెపై అత్యాచారం చేశాడు.  అత్యాచారం చేస్తూ వీడియోలు ఫోటోలు తీశాడు.  మత్తు నుంచి బయటకు వచ్చిన ఆ మహిళా జరిగిన దారుణం తెలుసుకొని బాధపడింది. ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.  


ఆ తరువాత ఫోటోలు బయటపెడతానని బెదిరించి అత్యాచారం, డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు.  ఈ విషయాన్ని హరీష్ తన ఫ్రెండ్ రమేష్ కు చెప్పడంతో రమేష్ కూడా ఆమెపై అదేవిధంగా చేసి డబ్బులు వసూలు చేశారు.  విదేశాల నుంచి వచ్చిన భర్త ఆమె మెడలో బంగారం తాడు లేకపోయే సరికి అనుమానం వచ్చిన భర్త నిలదీయంతో ఆమె అన్ని విషయాలు చెప్పింది.  దీంతో ఆ భర్త,బాధితురాలు కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.  కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు హరీష్, రమేష్ లను అరెస్ట్ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: