రాజకీయాల్లో ఏ పార్టీ అధికారం లోకి వస్తే ఆపార్టీ లోని మ్మెల్యే లు కార్యకర్తలు అందరు కూడా అప్పటి వరకు సైలెంట్ గ ఉన్నవారు ఒక్కసారిగా తమ ప్రత్యర్థుల ఫై విరుచుక పడటం సర్వ సాధారణం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే.. ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకోవడం. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పోయి.. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
అయితే, దీనికి భిన్నమైన వాతావరణం.. రాజధాని
జిల్లా గుంటూరులోని ఒకే ఒక నియోజకవర్గంలో కనిపిస్తోంది. అధికార పక్షం తరఫున గెలిచిన
ఎమ్మెల్యే ప్రతిపక్షం సభ్యులను పన్నెత్తు మాట అనరు. . ఇక, ప్రతిపక్షంలో కూర్చున్న నాయకుడు కూడా గెలిచిన నేతపై ఎలాంటి కామెంట్లు చేయరు. అదే పొన్నూరు నియోజకవ ర్గం. ఇక్కడ నుంచి గడచిన ఐదు ఎన్నికల్లోనూ
టీడీపీ అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర
కుమార్ విజయం సాధించారు అయితే, ఈసారి దీనికి భిన్నంగా ఇక్కడ
వైసీపీ పాగా వేసింది.
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు. కేవలం 1000 ఓట్ల తేడాతో ధూళిపాళ్ల నరేంద్ర ఓడిపోయారు. అయితే, వీరి మధ్య సహజంగానే రాజకీయ వైరం కొనసాగుతుందని, ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటారని అందరూ అనుకున్నారు. ఏపీలోనే కాదు.. గుంటూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిన
టీడీపీ మాజీల మధ్య ప్రతి రోజు యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.కానీ, చిత్రంగా ఇక్కడ అంతా గప్చుప్! అనే తరహాలో వ్యవహారం సాగుతోంది.
వైసీపీ ఎమ్మెల్యే రోశయ్య టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్లు పరస్పరం అవగాహన కు వచ్చారని, వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఇద్దరూ ఒక అగ్రిమెంట్కు వచ్చారని అంటున్నారు. ధూళిపాళ్ల నరేంద్రకు సంగం డెయిరీ ఉంది. ఇది భారీ వ్యాపారం దీంతో ఎమ్మెల్యే కిలారుతో ఓ ఒప్పందానికి వచ్చి.. దీని జోలికి రాకుండా చేసుకున్నారట.అదే సమయంలో నీ జోలికి నేను కూడా రానంటూ.. దూళిపాళ్ల నరేంద్ర కూడా కిలారుకు హామీ ఇచ్చారని మరో టాక్? దీనికితోడు నరేంద్ర తమ్ముడు సురేంద్ర కూడా ఒప్పందానికి వచ్చాడని అంటున్నారు.