వావి వ‌రుస‌లు మ‌రిచిన ఓ కామాంధుడు  మైన‌ర్ బాలిక‌పై అత్య‌చారం  జ‌రిపాడు. బాలిక  ఆ మృగాడికి కోడ‌లు అవుతుంది వరుస‌కు. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన ఆ వెధ‌వ స్లీప‌ర్ బ‌స్సులో ఈ దారుణం చేశాడు.  ఈ సంఘ‌ట‌న రాజస్థాన్‌లో జ‌రిగింది. అయితే ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాలిక రాజ‌స్థాన్‌లోని ఓ ప్రాంతంలో ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఇటీవ‌ల ఓ శుభ‌కార్యానికి కుటుంబ‌స‌భ్యులు, బంధుమిత్రుల‌తో క‌ల‌సి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు బంధువుల ఇంటికి బ‌య‌ల్దేరి వెళ్లారు. వారితో పాటు బాలిక‌కు మామ‌య్య వ‌రుస‌య్యే వ్య‌క్తి వెళ్లాడు.


అంద‌రూ అల‌సిపోయారు. కొంత‌సేపటి త‌ర్వాత  సేద తీరేందుకు డ్రైవ‌ర్‌తో స‌హ అంద‌రూ కింద‌కి దిగి ప‌రిస‌రాల‌ను గ‌మ‌నిస్తూ ఉన్నారు. అయితే బాలిక‌ను దిగ‌కుండా ఆపిన ఆ దుర్మార్గుడు బ‌స్సులోనే అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం ఎవరికి చెప్పొద్ద‌ని బెదిరించ‌డంతో ఆ బాలిక ఎవ‌రికీ చెప్ప‌లేదు. అయితే ఇంటికి వెళ్లాకా..క‌డుపునొప్పి అంటూనే బ‌స్సులో జ‌రిగిన విష‌యాన్ని త‌ల్లికి చెప్పింది.  దీంతో ఆమె పోలీసులను సంప్రదించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. 


దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, వైద్య పరీక్షల నిమిత్తం సదరు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఇటీవ‌ల నేష‌న‌ల్ క్రైం బ్యూరో వెల్ల‌డించిన ప్ర‌కారం... స‌మీప బంధువులు, స్నేహితులు..ఇంకా తెలిసిన వారి చేతిలోనే మ‌హిళ‌లు, బాలిక‌లు అత్యాచారాల‌కు గుర‌వుతున్న‌ట్లు నివేదిక సారాంశం. అయినా వాళ్లే చిన్నారుల‌ను కామంతో కాటు వేస్తూ హ‌త్యాచారాల‌కు ఒడిగ‌డుతున్నారు. 


స‌మాజంలో ఎవ్వ‌రిని న‌మ్మే ప‌రిస్థితి క‌న‌బ‌డ‌టం లేదు. చివ‌రికి తండ్రిని కూడా. ఆడ‌పిల్ల‌గా పుట్ట‌డ‌మే పాపంగా త‌యారైంది. అత్యాచార‌లు జ‌రిపే వారిలో యుక్త వ‌య‌స్సు కూడా స‌రిగ్గా రాని వారే ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న‌పై క‌న్నేసి ఉంచాల‌ని పోలీసులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: