ప్రస్తుతం ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఆస్తి కోసం  సొంత వారిని ఏమైనా చేసే విధంగా మారారు.ఇలాంటి సంఘటన నల్గొండ జిల్లా లో చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత కన్న తల్లినే ఇద్దరు కుమార్తెలు హత మార్చడం జరిగింది. ఈ దారుణ సంఘటన  ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఇక  పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం..నల్గొండ జిల్లా  అప్పాజీపేటకు చెందిన కల్లూరి సత్తెమ్మ (60)కి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు కలరు. ఇక అందరికీ పెళ్లిళ్లు కావడంతో వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. దీంతో ఒంటరిగా మిగిలిన సత్తెమ్మ పదేళ్లుగా అదే గ్రామానికి చెందిన కూరాల యాదయ్యతో కలిసి జీవనం కొనసాగిస్తుంది.


ఈ నేపథ్యంలో సత్తెమ్మ చిన్న కూతురు అయిన రుద్రమను తమతోపాటు ఉండాలని కోరడం జరిగింది.. కూతుర్ని యాదయ్యకి ఇచ్చి పెళ్లి కూడా జరిపించడం జరిగింది. ఈ క్రమంలో వారి ఇద్దరికీ  ఓ పాప కూడా పుట్టింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో రుద్రమ్మ భర్త నుంచి దూరం జరిగి చౌటప్పల్‌కు పోవడం జరిగింది. చౌటప్పల్‌లో  ఓ కిరాణా దుకాణం పెట్టుకుని తన జీవనం కొనసాగిస్తుంది.


తాజాగా రుద్రమ్మకు  డబ్బులు అవసరమైన  తల్లిని  డబ్బులు కావాలని ఆగడం జరిగింది.  సత్తెమ్మ మాత్రం నేను ఇవ్వనని, కొడుకులకు మాత్రమే డబ్బులు  ఇస్తానని తెలిపింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న రుద్రమ్మ.. చౌటుప్పల్ మండలంలోని రెడ్డిబాయిలో ఉంటున్న తన సోదరి మాదగోని ఆండాళుకు విషయం తెలియ చేయడం జరిగింది. దీంతో ఇద్దరూ కలిసి తల్లిని  హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం నెర్మటకు చెందిన గుయ్యాని జంగయ్యతో రూ.20 వేలకు ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది.


ఇక గత నెల 31న రాత్రి రుద్రమ్మ.. జంగయ్యతో కలిసి బైక్‌పై తల్లి ఇంటికి రావడం జరిగింది. అనంతరం సత్తెమ్మను జంగయ్య గట్టిగా పట్టుకోగా రుద్రమ్మ తల్లి గొంతు నులిమి ప్రాణాలు తీసేయడం జరిగింది. అనంతరం ఇంట్లోని మూడు తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి వస్తువులు, రూ.30 వేల నగదు తీసుకుని అక్కడి నుంచి పరారు అవ్వడం జరిగింది. ఇక సత్తెమ్మ కుమారుడు ఐనా  సైదులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానంతో రుద్రమ్మ ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా అసలు విషయం తెలుసుకోవడం జరిగింది. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకోని రిమాండ్‌కు తరలించడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: