మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. నూరేళ్ళు కలసి మెలసి పిల్లాపాపలతో దాంపత్య జీవితాన్ని గడపాల్సిన ఓ నవ వధువు తన వైవాహిక  జీవితానికి స్వస్తి పలకాలనుకుంది. ఈ మ‌ధ్య కాలంలో అనుమానంతో కొంతమంది, వివాహేతర సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక అదనపు కట్నాల వేధింపుల నేపథ్యంలో రోజు భార్య భర్తల మధ్య విభేధాలు భగ్గుమంటున్నాయి. ప్రతీ చిన్నవిషయానికి ఘర్షణలు పడుతూ దూరమవుతున్నారు. తల్లిదండ్రులకు తీరని క్షోభను మిగుల్చుతున్నారు. భార్య, భర్తల మధ్య విభేదాలు, అనుమానాలతో కాపురాలు నేలమట్టం అవుతున్నాయి. అయితే తాజాగా పెళ్లై వారం రోజులు గడువ లేదు. ఏమైందో కానీ.. భర్తకు విషమిచ్చిందో భార్య. 


అపస్మారక స్థితికి చేరుకున్న అతడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో లింగమయ్యకు, నాగమణి అనే యువతితో వారం రోజుల క్రితం వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఇష‍్టం లేకున్నా కూడా బలవంతంగా లింగమయ్యతో నాగమణి పెళ్లి చేశారు. దీంతో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడవలు జరుగుతుండేవి. ఇంటి కుటుంబసభ్యులు సర్దిచెబుతుండే వారు. కానీ..పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. అయితే అత్తవారింటికి వచ్చిన నాగమణి నవంబర్ 18వ తేదీ సోమవారం పాలల్లో విషం కల్పి ఇచ్చింది.


ఈ విషయం తెలియని లింగమయ్య నోట్లో నుంచి నురగలు కక్కుకుంటూ పడిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప‌రీక్షించిన వైద్యులు అతడు తాగిన పాలల్లో విషయం కలిసినట్లు గుర్తించారు. అలాగే పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్క‌డ చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గుత్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: