ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం పెళ్లైన ఒక నవవధువు భర్తకు విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించింది. కర్నూలు జిల్లా మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణికి వారం రోజుల క్రితం తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన లింగమయ్యతో వివాహమైంది. నాగమణికి పెళ్లి ఇష్టం లేకున్నా యువతి తల్లిదండ్రులు నాగమణికి లింగమయ్యతో పెళ్లి చేశారు. 
 
తన తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేశారనే ఆవేదనతో నాగమణి తన భర్తకు పాలల్లో విషం కలిపి ఇచ్చింది. పాలు తాగిన లింగమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు లింగమయ్యను గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుత్తి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి కేసును జొన్నగిరి పోలీస్ స్టేషన్ ను బదిలీ చేశారు. పోలీసులు యువతి నాగమణి, యువతి బంధువులను, లింగమయ్య కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. శావల్యాపురం మండలం పొట్లూరులో దుండగులు శ్మశానవాటిక దగ్గర ఒక యువతిని కాల్చి చంపేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు యువతిని దుండగులు హత్య చేసి కాల్చి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసులకు యువతి మృతదేహం దగ్గర ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. 

చనిపోయిన యువతి వివాహిత అని పోలీసులు గుర్తించారు. యువతిని శ్మశానవాటిక దగ్గరే చంపారా...? లేక ఎక్కడినా చంపి యువతిని శ్మశానవాటిక దగ్గరకు తీసుకొనివచ్చారా...? అనే విషయం తెలియాల్సి ఉంది. పొట్లూరు గ్రామానికి సంబంధించిన వారు ఎవరైనా ఈ యువతిని కాల్చి చంపి ఉంటారా...? అనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహం సగం కాలిపోయి ఉండటం పొట్లూరు గ్రామంలో కలకలం రేపుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: