డిసెంబర్ నెల మొదటివారంలో
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉందని
జగన్ గవర్నర్ తో ఈ సమావేశాల గురించి కూడా చర్చించారని తెలుస్తోంది. దాదాపు 45నిమిషాల పాటు ఈ భేటీ జరిగిందని సమాచారం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోలవరానికి కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు,
రాజధాని గురించి సీఎం
గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. చాలా రోజుల తరువాత సీఎం
జగన్ గవర్నర్ ను కలిశారు. నిన్న సీఎం
జగన్ గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు.
రాష్ట్రంలో ఇసుక కొరతను నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా
జగన్ గవర్నర్ కు వివరించారని సమాచారం. ఈరోజు సీఎం జగన్ ఇసుక అక్రమ రవాణాను నిరోధించటానికి టోల్ ఫ్రీ నంబర్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. విభిన్న అంశాలపై సీఎం
జగన్,
గవర్నర్ మధ్య చర్చలు జరిగాయి.
గవర్నర్ ఇచ్చిన విందు స్వీకరించిన అనంతరం
జగన్ దంపతులు
రాజ్ భవన్ నుండి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.