మాజీ క్రికెటర్,
బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తనపై విమర్శలు చేసిన ఆమ్ ఆదీ పార్టీ నేతలు, సోషల్ మీడియాలోని నెటిజన్లకు ఊహించని కౌంటర్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అక్కడి పార్లమెంటరీ ప్యానెల్ కాలుష్యం అంశంపై సమావేశం నిర్వహించింది. దీనికి గౌతం గంభీర్ రాకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలకు దిగింది.
గౌతమ్ గంభీర్ కనపడటం లేదని ఆప్ నేతలు అక్కడి వీధుల్లో పోస్టర్లు అతికించేశారు. అతను ఎక్కడైనా కనబడితే మాకు తెలియజేయండంటూ అందులో పేర్కొన్నారు. అయితే, దీనికి తాను జిలేబి తినడానికి, ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి సంబంధమేంటని ప్రశ్నించారు. జిలేబి తినడం వల్లే కాలుష్యం పెరిగిందంటే .. ఇకపై తినడం మానేస్తానని
మీడియా ముందు ప్రకటించాడు.
కీలక సమావేశానికి హాజరుకాకపోవడం అదే సమయంలో...ఇండోర్లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్ దగ్గర ప్రత్యక్షమై వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి
జిలేబీ తింటున్న ఫొటో కనిపించడంతో..సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు వైరల్ చేసేశాయి. దీంతో పలువురు సహజంగానే గంభీర్పై విమర్శలు గుప్పించాయి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ ప్రసార సంస్థతో ముందస్తు ఒప్పందం చేసుకోవడంతో కాలుష్యంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి తాను హాజరుకాలేకపోయానని వివరణ ఇచ్చారు.. గత జనవరిలోనే కాంట్రాక్టుపై నేను సంతకం చేశాను. ఏప్రిల్లో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ భేటీ ఎంత ముఖ్యమైనదో నాకు తెలుసు. ఒప్పందం కారణంగానే కామెంటరీ చేయడానికి ఇండోర్ వెళ్లానని..
నవంబర్ 11న నాకొక మెయిల్ రాగా.. అదే రోజు సమావేశానికి హాజరుకాలేకపోతున్నందుకు గల కారణాలను కూడా వారికి వివరించినట్టు గంభీర్ పేర్కొన్నాడు. తాను జిలేబి తినడం వల్లనే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందా. అలా అయితే చెప్పండి. ఇక నేను
జిలేబీ తినడమే మానేస్తా. 10నిమిషాల్లోనే నన్ను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టేశారు. ఈ కష్టమేదో
ఢిల్లీ కాలుష్యం నివారించడంపై ఫోకస్ చేస్తే స్వేచ్ఛగా
గాలి తీసుకోవచ్చు’ అని అన్నాడు.