అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇంకా లోకానికి కూడా సరిగ్గా చూడకముందే ఈ లోకం విడిచి పరలోకానికి వెళ్ళిపోయింది ఆ చిన్నారి. అనారోగ్యానికి చిన్నారి మరుసటి రోజే  మరణించింది. దీంతో తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. దీంతో ప్రార్థనలు చేస్తే మీ కూతురు బతుకు వస్తుంది అంటూ ఆ  తల్లిదండ్రులకు కొంతమంది వ్యక్తులు చెప్పడంతో... అల్లారుముద్దుగా పంచుకున్న తన కూతురు బతికితే అంతకంటే ఇంకేం  కావాలి అంటూ ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. కానీ ఆ తండ్రి ఆశ నెరవేరలేదు చనిపోయిన కూతురు బయటికి రాలేదు. ఈ ఘటన స్థానికంగా అందర్నీ కలచివేసింది. 

 

 

 

 ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అరవింద్ వనవాసి అనే వ్యక్తికి నాలుగేళ్ల కూతురు ఉంది. అయితే తన నాలుగేళ్ల కూతురు ఈనెల 14న అనారోగ్యానికి గురైంది. ఇక పరిస్థితి విషమించడంతో నా చిన్నారి మరుసటిరోజే ప్రాణాలను తీసింది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు మరణించడంతో అరణ్యరోదనగా విలపించాడు. ఒక్కసారి ప్రాణాలతో లేచి నాన్నా అని పిలిస్తే బాగుండు అనుకున్నాడు.ఇంతలోనే  తెలిసిన బంధువులు ప్రార్థనలు చేస్తే చనిపోయిన తన నాలుగేళ్ల కుమార్తె ప్రాణం పోసుకుని బతికి వస్తుందని చెప్పారు. దీంతో ఆ తండ్రి మరోసారి ఆశ కలిగింది తన కూతురు నిజంగానే బతుకు వస్తుందని ఆశించాడు. 

 

 

 

 దీంతో బంధువులు చెప్పిన మాటలు నమ్మి  కూతురు శవంతోనే  ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడు ఆ తండ్రి. కొన్ని రోజుల వరకు అలాగే ప్రార్ధనలు చేసారు. అయినప్పటికీ తన కూతురు మాత్రం బ్రతికి  రాలేదు. చుట్టుపక్కల వాళ్ళు అందరికీ ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో... చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వనవాసి  ఇంటికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పి చిన్నారి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికంగా ఈ ఘటన అందరిని కలిచివేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: