మద్యం మత్తులో కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణమైన ఘటనకు ఒడికట్టాడు. కన్నతల్లి, చెల్లి, తమ్ముడి భార్యపైనే అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అతడి అరాచకాలతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు అతడిని అతి దారుణంగా చంపి కొండగుట్టల్లో పడేశారు.

నవంబర్ 12న పోలీసులు మధ్యప్రదేశ్‌ దతియా జిల్లాలోని గోపాల్‌దాస్ ప్రాంతంలోని కొండగుట్టల్లో మృతదేహాన్ని కనుగొన్నారు. అతడి వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతుడు దతియా జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు అతడి కుటుంబ సభ్యులను విచారించగా తమకేమీ తెలీదని చెప్పారు. అయితే వారిపై అనుమానం వచ్చిన పోలీసులు మృతుడి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే కుటుంబ సభ్యుల సాయంతో చంపేసి గుట్టల్లో పడేసినట్లు అంగీకరించాడు. కన్న కొడుకునే చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని విచారించిన పోలీసులకు నిందితుడు చెప్పిన విషయాలు గగుర్పాటుకు గురిచేశాయి.

దతియా జిల్లాకు చెందిన ఆ వ్యక్తికి ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉంది. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు కాగా.. పెద్ద కుమారుడు మద్యానికి బానిస కావడంతో భార్య వదిలి వెళ్లిపోయింది. దీంతో అతడు ఉన్మాదిలా మారిపోయాడు. నిత్యం తాగొచ్చి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లి, చెల్లిపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కుటుంబం పరువు పోతుందన్న ఆందోళనతో వారు ఈ విషయంపై పోలీసులకు చెప్పలేదు.

నవంబర్ 11వ తేదీ రాత్రి బాగా మద్యం తాగి వచ్చిన ఆ వ్యక్తి తమ్ముడి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి కత్తితో ఆ కామాంధుడి గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో కుటుంబసభ్యుల సాయంతో మృతదేహాన్ని గోపాల్‌దాస్ గుట్టల్లో పడేశాడు. మరుసటిరోజు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలనం విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు మృతుడి తల్లిదండ్రులు, చెల్లి, మరదలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: