ఈ కాలంలో కామాంధులు మరి ఎక్కువ అయోయిపోతున్నారు.. రోజు రోజుకు ఈ కామాంధుల అరాచకాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు.. అత్యాచారాలు చేయాలనుకుంటారు. అక్కడ ఉన్నది పసి పాప లేక పండు ముసలిదా అని కూడా చూడరు. ఆడది అయితే చాలు ఈ కామాంధులకు. ఇలాంటి నీచులను తిట్టాలి అంటే ఒక్క ఆర్టికల్ సరిపోదు.. బుక్కులు బుక్కులు రాయాలి. 

 

ఇప్పుడు అది అంత కాదు.. ఇప్పుడు జరిగిన ఘోరం గురించి తెలుసుకోండి. ఓ నీచ కామాంధుడు బరితెగించారు.. అందుకే ఆ వితంతువు చంపేసింది. ఆమె చంపేంత ఎం చేశాడు అనుకుంటున్నారా ? అదేనండి అతనికి భార్య ఈమధ్యే చనిపోయింది. అటు ఆమెకి భర్త లేడు. దీంతో అదే అదునుగా భావించినా ఆ వ్యక్తి నీకు భర్త లేడు,, నాకు భార్య లేదు అంటూ ఆమెను వేధించాడు ఆ నీచుడు. 

 

దీంతో ఆ వేధింపులు రోజురోజుకు ఎక్కువ అయ్యే సరికి ఆమె తట్టుకోలేకా ఆ కామాంధుడిని ఘోరాతి ఘోరంగా హత్య చేసింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం సిద్దగూడెంలో వెలుగు చూసింది. ఈ నెల 12వ తేదీన సుద్దగూడెం సమీపంలోని జామాయిల్‌ తోటలో గోనెసంచిలో మృతదేహం ఉన్నట్లు విఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 

దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడు అదే గ్రామానికి చెందిన సవలం రాజయ్యగా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు విచారణ చెయ్యగా అతడికి కన్నమ్మ అనే మహిళతో పరిచయమున్నట్లు తెలుసుకుని ఆమెను విచారించారు. మొదట ఆమెకేమి తెలీదని చెప్పిన కన్నమ్మ తర్వాత తానే చంపానని ఒప్పుకుంది. 

 

రాజయ్య ఆమెను చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని, తనకు భార్య లేదని, నాకు భర్త లేడని.. అందుకే ఇద్దరం అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడని, మద్యం తాగి ఆమెపై అత్యాచారానికి యత్నించాడని.. అందుకే ఆ కామాంధుడు నుండి కాపాడుకోడానికి అతని తలకు గెట్టిగా కొట్టగా అతను అక్కడిక్కడే చనిపోయాడని.. వెంటనే అతని తమ్ముడు రత్తయ్య సహాయంతో మృతుదేహాన్ని గోన సంచిలో కట్టి పడేసినట్టు ఆమె తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: