ఆడవారిని ఎప్పుడైతే గౌరవించడం మరిచిపోయిందో ఈ సమాజం అప్పటినుండి వారిపై దాడులు మరింతగా పెరిగాయి. ఇదే కాకుండా వ్యభిచార మూఠాల వల్ల కూడా ఆడవారు, మహిళలు అంటే ఓ విలాస వస్తువుగా, శరీర వాంఛలు తీర్చే బొమ్మగా భావిస్తున్నారు మగవాళ్లూ.

 

 

వ్యభిచారం అనేది మన భారతదేశంలో చట్టబద్దం కాదు కాని ఇక్కడ చట్టాలు కూడా వాటిని అరికట్టలేక పోతున్నాయి. దీని వల్ల ఒక్కోసారి అమాయకమైన మహిళలు, బాలికలు కూడా వ్యభిచారులుగా చిత్రించబడి వేధింపులకు గురవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శారీక సుఖం కోరుకునే వాళ్లకోసం వ్యభిచారులు తయారవుతున్నారు కాని ఇది మనిషి మనుగడకే ముప్పులా మారే పరిస్దితులున్నాయి. ఎందుకంటే వ్యభిచారం నిర్వహించే వారు కొత్త కొత్త పద్దతులను అమలు చేస్తూ వారి దందాను యదేఛ్చగా కొనసాగిస్తున్నారు.

 

 

ఇక్కడైతే ఓ ముఠా కాలేజీ హస్టల్ పరిసరాల్లో తిష్ఠ వేసింది. దీని వల్ల చూసే వారికి కూడా కాలేజీలో చదువుకునే విద్యార్ధులను వ్యభిచారులుగా భావించే అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే ఓ అపార్ట్‌మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా  వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కొద్దికాలంగా రద్దీగా ఉండే కళాశాల హాస్టల్ పరిసరాలను ఎంచుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న, సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

 

వారిలో ఇద్దరు విటులు కాగా, నలుగురు నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే  గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు, మంగళగిరి మండలం చినకాకాని పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకుని దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

 

ఇక ఈ ప్రాంతంలో  ప్రైవేటు కళాశాలల హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎప్పుడూ విద్యార్థులతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో అయితే అనుమానం రాదన్న ఉద్దేశంతో యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో దాడులు చేసి కేసును నమోదు చేసి ఆ అపార్ట్‌మెంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: