కొన్ని సంఘటనలు చాలా దారుణంగా ఉంటాయి.  దేశంలో సంబంధాలు ఎప్పుడు ఎలా మారిపోతుంటాయో చెప్పడానికి వీలులేకుండా పోయింది.  దీంతో సంబంధాలు చెడిపోవడం దగ్గరి నుంచి అనుకున్న విధంగా పనులు జరగకపోవడం వరకు అన్ని సమస్యలు ఎదురౌతుంటాయి.  ముఖ్యంగా అక్రమ సంబంధాలు ఏర్పడటానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా..డబ్బు.  డబ్బు సమస్య కారణంగానే ఇలాంటి సంబంధాలు ఎక్కువగా వస్తుంటాయి.  తెలియకుండానే మనిషిలో ఇబ్బందులను కొని తెస్తుంటాయి.

 
అంతేకాదు, కొన్నిసార్లు ఈ సమస్యలు ప్రాణాలను తీసేవరకు కూడా తీసుకొస్తుంటాయి.  ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల హైదరాబాద్ నగరంలోనే జరిగింది.  ఆమెకు ఇద్దరు కూతుర్లు.  ఆ ఇద్దరు కూతుర్లకు పెళ్ళిళ్ళు అయ్యాయి.  పెళ్లిళ్లు చేసుకున్నాక ఏమైందో ఏమో తెలియదు.. సడెన్ గా ఆ తల్లిపై కక్ష పెంచుకున్నారు.  20వేలు సుపారీ ఇచ్చి తల్లిని కిరాతకంగా హత్య చేయించారు.  పోనీ తల్లిద్వారా ఆ కూతుర్లకు డబ్బు వస్తుందా.. అంటే అదేం కాదు.  మారేందుకు హత్య చేయించారు కారణాలు ఏంటి తెలుసుకుందాం.  


వాళ్ళది నల్గొండ జిల్లాలోని అప్పాజిపేట. ఆ గ్రామంలో కల్లూరి సత్యమ్మ అనే 55 సంవత్సరాల మహిళ ఉంటోంది.  ఆమెకు భర్త లేరు.  ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.  పెద్దమ్మాయి పేరు ఆండాలు, చిన్నమ్మాయి రుద్రమ్మ.   అయితే సత్యమ్మ కొంతకాలంగా యాదయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.  అతనితో అక్రమ సంబంధం కలిగి ఉన్నది.  కొన్నాళ్ల తరువాత ఆమె చిన్నమ్మాయిని కూడా అతనితో అక్రమ సంబంధం పెట్టుకునే విధంగా చేసింది సత్యమ్మ.  


సత్యమ్మ కొంతకాలం తరువాత యాదయ్యను ఇచ్చి వివాహం చేసింది.  యాదయ్య కారణంగా రుద్రమ్మకు ఓ బిడ్డ కలిగింది.  అయితే, తల్లితో భర్తకు ఉన్న అక్రమ సంబంధం కారణంగా తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఇక అక్కడ ఉండటం ఇష్టం లేక రుద్రమ్మ అక్కడి నుంచి వచ్చి నగర శివార్లలో ఉన్న చౌటుప్పల్ లో ఒంటరిగా ఉంటోంది.  దీంతో యాదయ్య తల్లిపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు.  ఇది గమనించిన రుద్రమ్మ తన అక్క ఆండాలుతో కలిసి జంగయ్య అనే వ్యక్తిని 20వేల రూపాయలు డబ్బులు ఇచ్చి తల్లిని హత్య చేయించారు. ఆ ఇంట్లో ఉన్న డబ్బును తీసుకొని ఉడాయించారు.  పోలీసుల విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి.  తల్లి చేసిన పనులను తట్టుకోలేకనే ఇలా చేసినట్టు ఆండాలు, రుద్రమ్మలు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: