రెండు రోజులు ఉండిపోవడానికీ  ఓ యువతి తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్లింది. కానీ అక్కడికి వచ్చాక చెల్లి చేసిన పని చూసి అక్క షాక్  కి గురయ్యింది . తన సొంత చెల్లి ఇంత పని చేయడమే ఏంటని  ఆశ్చర్యపోవడం ఆమె  వంతు అయింది.  చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం  బయటపడింది. అయితే అక్క ఇంటికి వచ్చిన ఆ యువతీ  చేసింది  అనుకున్నారు ప్రియుడి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అక్క ఇంట్లోనే దొంగతనం చేసింది . అసలేం జరిగిందో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే... మెండు ఝాన్సీ బంజారాహిల్స్ లోని రాహుల్ అనే యువకుని తో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. రాహుల్ హైదరాబాద్లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంత కాలంగా వీరిద్దరూ  ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఇటీవలే రాహుల్ కి కొంత డబ్బు అవసరం కావడంతో... ఈ విషయాన్ని ప్రియురాలు ఝాన్సీ కి చెప్పాడు రాహుల్

 

 

 

 అయితే ఝాన్సీ వద్ద కూడా అంత డబ్బు లేకపోవటంతో  ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా ప్రియుడు ఆర్థిక అవసరాలు తీర్చాలి అనుకుంది ఝాన్సీ. ఏం చేయాలా అని ఆలోచిస్తే టక్కున  ఓ ఆలోచన వచ్చింది ఆ యువతి. దీంతో దొంగతనం చేయడానికి కూడా వెనుకాడలేదు ఆ యువతీ . దొంగతనం చేసి అయిన  సరే తన ప్రియుడి ఆర్థిక అవసరాలను తీర్చాలని అనుకుంది . దీనికోసం ప్లాన్ కూడా వేసుకుంది ఆ  యువతి. ఈ క్రమంలోనే ఇటీవల ఫిర్దాజిగూడలోని  అక్క ఇంటికి వెళ్ళింది. ఇక అక్క ఇంట్లో లేని సమయంలో బీరువా తెరిచి నగలను దొంగలించి ప్రియుడు అందజేసింది . ఇక అక్కడి నుంచి ఓ రేంజ్ లో నటించడం ప్రారంభించింది ఝాన్సీ. నగలు  ఎవరు ఎత్తుకెళ్లారో  కూడా తనకు తెలియదు అన్నట్టుగా తెగ నటించేసింది . ఇక నగలు పోయాయని  గుర్తించిన ఆ యువతి అక్క చెల్లిని  ఏ మాత్రం అనుమానించలేదు . 

 

 

 

 మరోవైపు ఆ చెల్లి కూడా  తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా నటించడంతో ఆ యువతీ అక్కకి అనుమానం  కూడా రాలేదు. జరిగిన సంఘటనపై బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఇక రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి తమదైన శైలిలో విచారణ చేపట్టడం తో అసలు యవ్వారం  బయటపడింది. విచారణలో భాగంగా ఝాన్సీ ని విచారించగా తానే నగలు  దొంగిలించినట్లు ఒప్పుకుంది. దీంతో షాక్ అవ్వడం యువతి అక్క వంతయింది. దీంతో తన సొంత చెల్లెలు దొంగతనం చేయడం ఏమిటని ఒకింత ఆశ్చర్యానికి షాక్కి గురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: