తమ ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని కడలూరు జిల్లా కొట్లాంబాక్కం గ్రామానికి చెందిన ఆదిమూలం కుమారుడు మదన్. ఇతను మెకానిక్ గా పని చేస్తున్నాడు. తోరపాటి గ్రామానికి చెందిన పాండురంగన్ కుమార్తె శ్వేత. ఈ ఇరుకుటుంబాలకు బంధుత్వం ఉంది. దీంతో మదన్, శ్వేతలు స్నేహంగా ఉండేవారు. శ్వేత నర్సింగ్ చదువుతోంది. అప్పుడప్పుడు మదన్ శ్వేతను సాయంత్రం వేళ ఇంటి వద్ద దింపి వెళ్లేవాడు. అలా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. బంధువులు కావడంతో తల్లిదండ్రులకు కూడా అనుమానం రాలేదు అంటే నమ్మండి. 

 

సంవత్సరం పాటు వీరి ప్రేమ వ్యవహారం నడిచింది. ఇటీవల దైర్యం చేసి తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఇరు కుటుంబాల వారు కూడా ఒప్పుకోలేదు. దీంతో వారు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం శ్వేత కాలేజికి వెళుతున్నానని చెప్పి ఇంటికి  తిరిగి రావడం జరగలేదు . ఆస్పత్రి పని నిమిత్తం కాలేజిలోనే ఉంది అని తల్లిదండ్రులు అనుకున్నారు. 

 

సోమవారం అర్దరాత్రి సమయనా కనిచ్చ పాక్కం రైల్వే గేటు సమీపాన వీరు రామేశ్వరం ఎక్స్ ప్రెస్ కు ఎదురుగా వెళ్లడం జరిగింది. ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని రైలుకు ఎదురు వచ్చారు. వీరిని గమనించిన డ్రైవర్ గట్టిగా హారన్ కొట్టి, రైలు స్పీడ్ ను తగ్గించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ వీరు అతి సమీపంలో ఉండడంతో వారిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని డ్రైవర్ వెంటనే పోలీసులకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడలూరు ఆస్పత్రికి తరలించడం జరిగింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ ఘటనతో ఇద్దరి  కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: