వైఎస్ జగన్ ప్రభుత్వం మత వివక్ష , కుల వివక్ష చూపుతోంది. ప్రత్యేకించి ఓ మతం వారిని ప్రోత్సహిస్తోందా.. కేవలం ఒక మతం వారికి మేలు కలిగేలా చర్యలు తీసుకుంటోందా.. ఆయన ప్రవేశ పెడుతున్న ఇంగ్లీష్ మీడియం కూడా కేవలం ఒక మతం వ్యాపించేందుకు అనుకూలంగా ఉంటుందనే తీసుకొస్తున్నారా.. ఏపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇది.

 

ఎల్లో మీడియాతో పాటు ఎల్లో నాయకులు ఈ ప్రచారం జోరు పెంచుతున్నారు. అయితే.. కులం, మతం, వర్గం, పార్టీ తేడా లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ను అభినందించాల్సిందిపోయి మత ప్రచారం అంటగట్టడం బాధాకరమంటున్నారు వైసీపీ నేతలు . వాహన మిత్ర, రైతు భరోసా వంటి విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తూ కులమతాలకు తావు లేకుండా పాలన చేస్తుంటే పచ్చ మీడియా, ప్రతిపక్షాలు అన్యమతాన్ని అంటగడుతున్నారని డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా మండిపడ్డారు.

 

మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి రూ. 10 వేలకు పెంచారు. జనవరి 9అమ్మఒడి కార్యక్రమానికి శ్రీ కారం చుట్టబోతున్నాం. సుమారు 45 లక్షల మంది తల్లులకు రూ. 10 వేల చొప్పున అందించనున్నాం. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాన్ని అంగట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని అభినందించాల్సిందిపోయి దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు.

 

పవిత్ర జెరూసలెం, హజ్‌ యాత్రకు వెళ్లేవారికి ఆర్థిక సాయం అందిస్తుంటే పచ్చ పత్రికలు, పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగు దేశం పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు అవాకులు పేలుతుందన్నారు. వీరు ఖండించినంత మాత్రాన ఎల్లో దుష్ప్రచారం ఆగుతుందా.. కాకపోతే ఆ ప్రచారాన్ని ఎంత వరకూ జనం నమ్ముతారనేదే అసలు సంగతి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: