ఏపీ సర్కారు కొత్తగా నవశకం అనే కార్యక్రమం చేపట్టింది. కానీ దీని ద్వారా ఏంచేస్తారన్నది చాలా మందికి అర్థం కాని విషయం. ఇప్పుడు కొత్తగా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారు. దీనివల్ల కలిగే లాభాలేంటో వారికి తెలియదు. అయితే ఇది కొత్త పథకం కాదు.. కానీ ప్రభుత్వ పథకాలను సమర్థంగా జనం వద్దకు తీసుకెళ్లే కార్యక్రమం. గతంలో పేరుకు పథకాలు ప్రకటించి అర్హతల్లో కోత విధించిన గత ప్రభుత్వ రెండు నాల్కల సిద్ధాంతానికి ఇప్పటి సర్కారు స్వస్తి పలికింది.

 

అసలైన అర్హులకే పథకాల వర్తింపు, లబ్దిదారుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహిరిస్తోంది. అర్హత నిబంధనల్లోనూ సమూలమైన మార్పులు చేసి, మరింతమంది లబ్దిదారులకు మేలు చేకూర్చేలా వైయస్సార్ నవశకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మొత్తంగా 12 రకాల పింఛన్లు ప్రతినెలా పంపిణీ అవుతున్నాయి. గత ప్రభుత్వాలు సామాజిక పింఛన్ల వ్యవహారంలో చేసిన అవకతవకలన్నీ నేటి వైయస్సార్ నవశకం ద్వారా సరిదిద్దబోతున్నారు.

 

ఉదాహరణకు చూస్తే గతంలో 40 నుంచి 79 శాతం అంగవైకల్యం ఉన్న వారికి నెలకు రూ.2000, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉంటే మరికొంత ఎక్కువ పింఛను అందేది. ఇప్పుడు దివ్యాంగులందరికీ రూ.3000 చొప్పున పింఛను అందిస్తున్నారు. వైకల్యానికి శాతాలతో కొలమానం లేకుండా చేయడం శుభపరిణామం. దీనివల్ల 3,89,094 మంది దివ్యాంగులు లబ్ది పొందుతున్నారు. మరెన్నో సంక్షేమ పథకాలకు అర్హతా పరిమాణాలను పెంచింది జగన్ ప్రభుత్వం.

 

పెరుగుతున్న జీవన ప్రమాణాల దృష్ట్యా, తరుగుతున్న రూపాయి విలువను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ పథకాలకు అర్హతా నిబంధనల్లో మార్పులు చేసారు. ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో కుటుంబ వార్షికాదాయం 90,000 దాటితే వారు ప్రభుత్వ పథకాలందుకునేందుకు అనర్హులు. బైక్ ఉన్నా, కారు ఉన్నా, 750 .అడుగుల ఇల్లు ఉన్నా, రెండెకరాల పైన భూమి ఉన్నా వారికి ప్రభుత్వ పథకాలు వర్తించేవి కాదు. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: