తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వయసు మీద పడేసరికి మతిస్థిమితం లేకుండా పోయింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు ఎంతో తెలివిగా అందరిని ముంచే చంద్రబాబు ఇప్పుడు సుపుత్రుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మీద ప్రేమతో తెలివంతా గోదారి పాలయ్యింది అని అంటున్నారు. 

              

అంతే కాదు.. అతని కొడుకుని వారసుడిని చెయ్యాలని అనుకుంటే.. అతను కాస్త పప్పు అయ్యాడని తీవ్ర మనోవేదనకు గురయినట్టు చెప్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే సమయంలో పుసుక్కున నోరు జారాడు చంద్రబాబు నాయుడు.. 

             

అది ఎంత నీచంగా అంటే.. ఒక్క ఆంధ్ర ప్రజలే కాదు ప్రపంచమంతా ఆ లడ్డు అంటే పవిత్రమైన అమృతంగా భావిస్తారు. కానీ చంద్రబాబు ఆ లడ్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ లడ్డు ఏంటి అనుకుంటున్నారా ? ఇంకేంటి అండి ప్రపంచమంతా ఇష్టపడే లడ్డు తిరుపతి లడ్డు. ఈ లడ్డు కోసం వెంకన్న కోసం ప్రపంచం నలుమూలల నుండి వస్తారు. 

                 

అలాంటి పవిత్రమైన వెంకన్న లడ్డును మద్యంతో పోల్చాడు చంద్రబాబు నాయుడు. మద్యం ధరలు పెంచినట్టే తిరుమల లడ్డు కూడా పెంచుతున్నారంటూ.. ఏడుకొండల వెంకన్న ప్రసాదాన్ని దారుణంగా అవమానించాడు చంద్రబాబు నాయుడు. అమ్మకాలు తగ్గించేందుకు మద్యం ధరలు పెంచుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 


అయితే చంద్రబాబు ఈ తీవ్ర వ్యాఖ్యల పట్ల వెంకన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల లడ్డుని మద్యంతో పోల్చడమేంటి చంద్రబాబు అని సోషల్ మీడియా వేధికగా మండిపడుతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: