వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని, దేవినేని ఉమా మీడియా సమావేశం చూడాలంటే ప్రజలకు అసహ్యం వేస్తోందని మండిపడ్డారు. 

ఉమా ఇసుక మాఫియా కింగ్ అని.. అందుకే చంద్రబాబు తన ఇసుక దీక్షావేదిక మీద ఆయనను కూర్చోనివ్వలేదన్నారు. గతంలో ఉమా 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం రాసుకోండి అంటూ.. బీరాలు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 అయినా పోలవరం పుతి కాలేదని కేవలం చేసిన వాఖ్యలు నోటికే పరిమితం అయ్యాయని అన్నారు. మీరు చేసిన అవినీతి నచ్చకనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్ టెండరింగ్ చేపట్టారని గుర్తు చేశారు.

కేసీఆర్‌ దేవినేని ఉమా వెకిలి చేష్టలు చూసి ఆడో మగో తెలియదన్నారని, ఇప్పుడు అదే నిజమవుతోందని వ్యాఖ్యానించారు. దేవినేని ఉమా పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదాంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దేవినేని ఉమా మంత్రులను పట్టుకొని సన్నాసి అని మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వైఎస్‌ జగన్‌కు సంస్కారం ఉంది కాబట్టి టీడీపీ నేతలపట్ల గౌరవంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేఇకనైనా దేవినేని ఉమా వెకిలి చేష్టలు మానుకోవాలని సూచించారు.

ఏపీలో టీడీపీ అంపశయ్య మీద ఉందని, చేసిన అవినీతికి దేవినేని ఉమాకు జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో కనుమరుగైన ఆ పార్టీకి జాతీయ పార్టీ అని చెప్పుకొనే అర్హత లేదన్నారు. లోకేష్, ఉమా ఎక్కడెక్కడ కమీషన్లు తీసుకున్నారో వెల్లడించేందుకు ఆ కమీషన్లు ఇచ్చినవారు త్వరలో మీడియా సమావేశం పెడుతున్నారని తెలిపారు. మైలవరం నియోజకవర్గం పనుల్లో నారా లోకేష్‌ 5 శాతం, ఉమా 3 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేశారని ఆయన ఆరోపించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: