బీజేపీకి ఎప్పటి నుండో దక్షిణాది రాష్ట్రలో పాగా వేయాలి అని కోరిక .దేశం మొత్తం మోడీ హవా ఉన్న కూడా దక్షిణాది రాష్ట్రలో ఆ ప్రభావం అంతగా లేదు అనే చెప్పాలి.అవకాశం చిక్కినప్పుడు అంత లోకల్ నేతలని బుట్టలో వేసుకుంటుంది .టీడీపీలో కీలక నేతలకు గాలం వేసే పనిలో బీజేపీ బాగా బిజీగా ఉంది. ఇప్పటికే చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు సీనియర్లను సంప్రదించిన కమల దళం ఇప్పుడు వ్యూహం మార్చిందట. జిల్లాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలు బలమైన నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.


ప్రకాశం జిల్లా పై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం అక్కడ బలమైన నేతలకు గాలం వేసే పనిని మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మాజీ జడ్పీ చైర్మన్ అయిన  "ఈదర" హరిబాబును ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 

ఈదర హరిబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన ముఖ్య నేత. 1994లో టీడీపీ తరుఫున ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు ఆయన ఓడిపోయారు. 2014లో ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ గా అయిపోయారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఈదరను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చేయాలని అధిష్టానం డిసైడ్ అయ్యిందట.. ఈదరకు బీజేపీ సీనియర్ నాయకులు పురంధేశ్వరి సుజనా చౌదరిలతో మంచి సంబంధాలు ఉండడం.. మద్దతు లభించడంతో ఈయన నియామకం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీ కీలక నేతలు ఇటీవల సుజనాచౌదరితో భేటి కావడంతో వారంతా బీజేపీలో చేరడం ఖాయమన్న అంచనాలు నెలకొన్నాయి. కరణం బలరాం లాంటి ఎమ్మెల్యే కూడా సుజనాతో భేటి కావడంతో ఇక ఆయన కూడా పార్టీ మారుతారా అన్న సందేహాలు నెలకొన్నాయి.చూడాలి మరి ప్రకాశం జిల్లాలో బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత వరకు ఫలితం ఇస్తుందో అని . 

మరింత సమాచారం తెలుసుకోండి: