ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో బంధాలు..అనుబంధాలు మంటగలిసిపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ప్రియుడి కోసం కన్నతల్లినే హతమార్చిన కూతురు..ఆస్తి కోసం ప్రియుడు,భర్తతో కలిసి కన్నతల్లిని చంపిన కూతురు, తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను, చివరికి కన్న పేగు బంధాలను సైతం దారుణంగా చంపుతు నీచమైన వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.  తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో పెళ్లయిన వారం రోజులకే నవవధువు భర్తకు విషం పెట్టి చంపాలని చూసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. 

 

 తానంటే మొదటి నుంచి ఇష్టం లేని తన భార్య మజ్జిగలో పురుగుల మందు కలిపి చంపడానికి ప్రయత్నించిందని లింగమయ్య వ్యక్తి ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. అయితే కొత్తగా పెళ్లైన నవ వధువు మజ్జిగలో విషం కలిపి భర్తకు ఇచ్చిందని, మజ్జిగ తాగిన తర్వాత అనుమానం వచ్చిన భర్త వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని ఇప్పటివరకు అనుకున్నారు.  తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు లోకి వచ్చింది. అయితే ఇది నవ వధువు ప్లాన్ కాదని..ఆమె భర్తనే ఇష్టం లేక ఇలాంటి కట్టు కథ అల్లాడని పెళ్లికూతురు బంధువులు ఆరోపిస్తున్నారు. 

 

మజ్జిగలో నవవధువు పురుగుల మందు నిజంగానే కలిపితే.. భర్తతో పాటే ఆసుపత్రికి ఎందుకు పరుగులు తీస్తుంది? ఈ విషయంలో కొత్త పెళ్లికూతురు నాగమణి కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. నాగమణి సగం మజ్జిగ తాను తాగిన తర్వాతే భర్తకు ఇచ్చిందని, అలాంటప్పుడు ఆమె ఎందుకు అనారోగ్యానికి గురికాలేదని ఆమె తరపు బంధువులు ప్రశ్నిస్తున్నారు. పెళ్లైనప్పటి నుంచి లింగమయ్యలో ఏదో మార్పు వచ్చిందని..ముభావంగా ఉంటున్నారని.. భార్యతో కాపురం చేయడం ఇష్టంలేకే నాటకమాడుతున్నాడని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డపై లేని పోని ఆరోపణలు చేస్తూ మీడియా పరంగా రచ్చ చేస్తున్నారని..నిజా నిజాలు తెలుసుకొని తమ కూతురుకి న్యాయం చేయాలని, అతడికి శిక్ష పడేలా చేయాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: