పెళ్లి అన్నది జీవితంలో మరిచిపోలేని ఓ గొప్ప మధురానుభూతికి సంబంధించిన అంశం. పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. పెళ్లి సిద్ధం అవుతుంటారు. పెళ్లి చేసుకొని సెటిల్ కావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమందికి పెళ్లి తరువాత కలిసి వస్తుంది. మరికొందరికి పెళ్లి తరువాత పెద్దగా కలిసిరాదు. కలిసి వచ్చినా రాకున్నా.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటారు.
అబ్బాయిల కంటే అమ్మాయిలే పెళ్లిని ఎక్కువగా ఆస్వాదిస్తారు. పెళ్లి జరగబోతుందనగా ముందునుంచే ప్రిపేర్ అవుతుంటారు. అన్ని రకాలుగా హంగామా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, కొంతమందికి పెళ్లి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇటీవలే ఓ యువతికి పెళ్లి జరిగింది. పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టి సరిగ్గా వరం రోజులైంది. వారం తిరక్కుండానే అత్తింటి వాళ్ళు ఆ అమ్మాయిని ఇంటికి పంపించేశారు.
కారణం ఏంటిఅంటే.. గర్భం.. పెళ్లి జరిగిన వారం రోజుల్లోనే నాలుగు నెలల గర్భం ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చింది.. అని అత్తింటి వాళ్ళు ఆరాతీశారు. కూతురు గర్భవతి అనే విషయం ఆ తల్లిదండ్రులకు కూడా తెలియదు. దానికి కారణం ఎవడు ఏంటి అని తెలిస్తే నిజంగా ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలుకు చెందిన 17 సంవత్సరాల యువతిపై అదే గ్రామానికి చెందిన అప్పలరాజు అనే వ్యక్తి కన్నేశాడు.
ఆ బాలిక స్నానం చేస్తుండగా ఫోటోలు తీశారు. వీడియో తీశాడు. అప్పటి నుంచి బ్లాక్ మెయిన్ చేస్తూ.. ఆమెపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. విషయం తెలియకుండా ఆ యువతికి వివాహం చేశారు. వివాహం చేసిన తరువాత, ఆ యువతి గురించి కొంతమంది అత్తారింట్లో చెప్పడంతో అనుమానం వచ్చి డాక్టర్ కు చూపిస్తే గర్భవతి అని తేలింది. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు అప్పలరాజుపై కేసు పెట్టారు. అక్కడి నుంచి పారిపోవాలని చూసిన అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.