అక్రమ సంబంధం వ్యవహారాలు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. అదుపులో పెట్టుకోలేని కోరికలతో కొందరు... విలాసవంతమైన జీవితం కోసం మరికొందరు ఇలా రకరకాలుగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. మన దేశంలో జరుగుతున్న హత్యలు మూడు వంతులకు పైగా అక్రమ సంబంధాలు నేపథ్యంలో జరుగుతున్నాయి. అక్రమ సంబంధాలు తప్పు అని తెలిసినా కూడా... ఎవరికి వారు వీటిని కంటిన్యూ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
అక్రమ సంబంధం వ్యవహారంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో కొలాథూర్లో జరిగింది. చిత్లాపక్కం ప్రాంతానికి చెందిన అన్వర్ బాషాకు పెళ్లి అయ్యింది. అతడికి భార్యతో విబేధాలు వచ్చాయి. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో మూడేళ్ల క్రితం భార్య పర్వీన్తో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. అతడికి వినాయకపురంలోని మహిళతో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. బాషా అప్పుడప్పుడూ ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగించేవాడు.
కొద్ది రోజుల పాటు చాటు మాటుగా వీరి వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆ మహిళ పెద్ద కొడుక్కి విషయం తెలిసి వారిద్దరిని హెచ్చరించాడు. ఆ యువకుడు బాషాతో పలుమార్లు గొడవపడ్డాడు. అయినా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. తల్లి కూడా బాషాతో రాసలీలలు కొనసాగించేందుకే ఇష్టపడింది. ఈ క్రమంలోనే వారి రాసలీలలు ఇటీవల మరింత ఎక్కువయ్యాయి.
ఈ నెల 18న ఆ మహిళ పెద్ద కొడుకు రాత్రి ఇంటికి రాగా తన తల్లి ప్రియుడితో సెక్స్ చేస్తుండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. బాషా తన తల్లితో ఆ విధంగా ఉండటాన్ని చూసిన ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి అక్కడి రప్పించాడు. వారంతా కలిసి బాషాను తీవ్రంగా కొట్టారు. బాషా తలకు దెబ్బలు తగలడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో నిందితులంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై రాజమంగళ: పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.