ఈ ప్రపంచంలో మహిళలు వేధింపులకు రంగం అంటూ లేదు. ఉన్నత ఉద్యోగం చేసుకునే మహిళల నుంచి చిన్నా చితకా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే మ‌హిళ‌లు... చివరకు ఇళ్ల‌లో పనులు చేసుకునే మహిళలు.. ఇంకా చెప్పాలంటే అనాధలుగా ఉన్న మహిళలు సైతం మృగాళ్ల‌ దారుణమైన వేధింపులకు బలవుతున్నారు. వారి కామ కోరికలు తీర్చాలన్న వేధింపులు మహిళలపై రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి.

 

తాజాగా ఓ కామాంధుడి వేధింపుల‌తో ఓ వివాహిత చిక్కుల్లో ప‌డింది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. కుటుంబ పోషణ నిమిత్తం ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్న వివాహిత ఓ కామాంధుడి కారణంగా ఆపదలో పడింది. కోరిక తీర్చాలంటూ వెంటపడుతున్నారు తనను పట్టించుకోకపోవడంతో ఆ దుర్మార్గుదు మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 

రాయవరంకి చెందిన ఓ వివాహిత తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ బట్టల షాపులో రెండేళ్లుగా సేల్స్ వుమెన్ గా పనిచేస్తోంది. ప్రతిరోజు ఉదయం పనికి వెళ్లి వచ్చే సమయంలో ఆ వివాహితకు పెయింటింగ్ పనులు చేసే సుబ్బారావు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆమె తో ప‌రిచ‌యం పెంచుకున్న సుబ్బారావు తన కోరిక తీర్చాలని... తన తో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కొద్దిరోజులుగా సుబ్బారావు వేధిస్తున్నాడు.

 

అందుకు ఆమె ఒప్పు కోలేదు. దీంతో అతడు తీరు మార్చుకోక పోవడంతో ఈ విషయాన్ని పెద్ద‌ల‌ దృష్టికి తీసుకు వెళ్ళింది. దీంతో వాళ్ళందరూ కలిసి అత‌డిని మందలించారు. మరోసారి ఇలా చేస్తే పోలీసు కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఆమెపై క‌క్ష క‌ట్టిన సుబ్బారావు బుధవారం ఆమె ప‌ని ముగించుకుని షాప్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బ్లేడుతో దాడికి పాల్ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో మహిళ మెడ, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సుబ్బారావును చితకబాది పోలీసులకు అప్పగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: