సిఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టే విధానాన్ని మొదటినుండి  నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్  వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పుడు బాబు సైడ్ అయిపోయారు పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియాన్ని అడ్డుకుని ఏపీ ప్రజల దృష్టిలో మెయిన్ విలన్ గా మారిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ ఇంగ్లీష్  మీడియం వ్యవహారంలో ఇంతలా వ్యతిరేకించవలసిన అవసరం ఏముందని అందరూ భావిస్తున్నారు. వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేసి, అవగాహన హెంచుకుంటే జగన్ చేస్తున్నదేంటి, దానివల్ల కలిగే లాభాలేంటనేది పవన్ కి అర్థమై ఉండేది.

 

            తెలుగును  ఓ సబ్జెక్ట్ గా ఉంచుతూనే ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాలనేది జగన్ ప్రయత్నం. కానీ పవన్ మాత్రం తెలుగుని చంపేస్తున్నారు, తెలుగు భాషే లేకుండా చేస్తున్నారంటూ వితండవాదం చేస్తున్నారు. తెలుగుకి అనుకూలంగా మాట్లాడుతుండే సరికి గతంలో పవన్ ని పట్టించుకోని మీడియా కూడా ఇప్పుడు ప్రముఖంగా ఆయన వార్తల్ని కవర్ చేస్తోంది. దీంతో మరింతగా ఉబ్బిపోయి, తబ్బిబ్బైపోయి పవన్ కల్యాణ్ ఆవేశానికి లోనయ్యారు. ఆ పేపర్ కటింగ్ లను చూపిస్తూ పోస్టింగ్ లు పెడుతూ వచ్చారు.

 

          ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నప్రతిపక్ష నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ భాషను ఎవరు చంపడం లేదు,భాషను పూర్తిగా విస్మరించడం లేదు. ఉన్నత చదువులకు వెళ్లే కొద్దీ ఇంగ్లిష్ పదాలు, ఇంగ్లిష్ మీడియం అనేది కచ్చితంగా అవసరం. కంప్యూటర్ చదువులొచ్చాక ఉపాధి కోసం ఇంగ్లిష్ తప్పనిసరి అయింది. అదేదో చిన్న వయసులోనే నేర్చుకుంటే.. ఆ తర్వాత చదువుల్లో రాణించడం మరింత సులువు అవుతుంది. తెలుగు భాషను కించపరిచినట్టు కూడా కాదు. తెలుగు అనే సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. తెలుగు ఇష్టపడేవాళ్లు, తెలుగు భాషను అభిమానించేవాళ్లు. తెలుగులో డాక్టరేట్ వరకు వెళ్లొచ్చు, దీనికొచ్చిన ఇబ్బందిలేదు, దీన్నెవరూ తీసేయనూ లేదు.

 

           ఈ విషయాలు పవన్ కి చెప్పేవారు లేకపోవడం వలనో,దానిపై పూర్తి సమాచారం తెలియకనో  జగన్ ని విమర్శిస్తూ పోతున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు తెలివిగా పక్కకు తప్పుకున్నారు. పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండే సరికి మెల్లమెల్లగా సైలెంట్ అయ్యారు. ఇంగ్లిష్ మీడియం వద్దనలేదు, తెలుగు మీడియం కూడా కొనసాగిస్తే బాగుండేది కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.  

 

          ఇంగ్లిష్ మీడియంపై జరుగుతున్న రాద్ధాంతాన్ని తెలివిగా పవన్ పైకి నెట్టేసి, తాను మాత్రం టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, తిరుపతి వెంకన్నను దూషిస్తున్నారంటూ ఊరూవాడా తిరుగుతున్నారు. త్వరలోనే మన నుడి-మన నది అంటూ ఏదో కార్యక్రమం చేపట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ఉదయం నుండి వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి ఏపీ సర్కారు నిన్ననే జీవో జారీ చేసింది. పేద ప్రజల దృష్టిలో ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకుంటున్న వారందరూ విలన్లుగా చూస్తున్నారు ప్రజలు అని పాలక పక్ష నాయకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: