చంద్రయాన్ 2.. ఎన్నో కోట్లమంది కల నిజమయ్యే చివరి క్షణాల్లో చంద్రయాన్ విఫలం అయ్యింది. ఎంతో ప్రేమతో ఒక కొత్త చరిత్రను సృష్టించాలనుకున్న వారి కల అతి సమీపంలో ఉందన్నంగా, చంద్రుడికి అత్యంత సమీపంలోకి వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ చివరి నిమిషంలో విఫలం అయ్యింది.. అయితే ఆలా కావడానికి చంద్రయాన్ లోని సాఫ్ట్ వెర్ లోపమే కారణమని ఇస్రో ఈ మధ్య ప్రకటించింది.

 

అయితే ఈ చంద్రయాన్ గురించి నేడు లోక్‌సభ సమావేశాల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఓ సభ్యుడు చంద్రయాన్‌ ఖర్చు, తయారీ వివరాలు చెప్పాలని ప్రశ్నించాడు. అయితే ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. 'దేశంలోని ప్రతి భారతీయుడు గర్వపడేలా ఇస్రో చంద్రయాన్‌-2ను ప్రయోగించింది. జులై 22న GSLV MK III-M1 వాహక నౌక ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపింది. 

 

చంద్రయాన్‌-2 కక్ష్యను పెంచుకుంటూ పోయి 276 x 1,42,975 కి.మీకు చేర్చారు. ఐదు సార్లు కక్ష్యను పెంచారు. సెప్టెంబరు 7న సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండరు చంద్రుడి ఉపరితలం వైపుగా దిగడం మొదలైంది. చంద్రుడి ఉపరితలానికి మరో 500 మీటర్ల దూరంలో ఉండగా ల్యాండరులో సాంకేతిక సమస్యల తలెత్తినట్లు ఇస్రో ఛైర్మన్‌ కె. శివన్‌ ప్రకటించారు. 

 

అయినప్పటికీ ఇస్రో శ్రమను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మన దేశ ఔన్నత్యాన్ని మరింత పెంచే విధంగా శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయింది' అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వివరించారు. కాగా ఇస్రో నివేదిక ప్రకారం.. ట్రయిల్ పీరియడ్ లో బాగా పని చేసిన సాఫ్ట్ వెర్ చంద్రుడి ఉపరితలం మీద ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే సమయంలో పని చేయలేదు. సాఫ్ట్‌వేర్ వైఫల్యం కారణంగానే చంద్రయాన్ 2 విఫలమయ్యింది అని ఇస్రో నివేధిక ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: