ఈ మద్య మహిళలపై వరుసగా అరాచకాలు పెరిగిపోతు న్నాయి.  కామాంధులకు చిన్నా పెద్ద వయసు తో తేడా లేకుండా ఆడది కనిపిస్తే పిచ్చి కుక్కల్లా రెచ్చిపోతున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే ఆ మద్య హన్మకొండలో తొమ్మిదేళ్ల పసిపాపై అత్యాచారం చేసి గొందు నులిమి చంపిసేస ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృస్టించింది.   అయితే ఆ దుర్మార్గుడికి చచ్చేంత వరకు జైల్లోనే ఉంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది.  అయితే కామంతో రెచ్చిపోయే వారికి కఠినమైన శిక్షలు లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మహిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి.  

 


ఫోస్కో, నిర్భయ చట్టాలు అమల్లో ఉన్నా వాటిని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు కొంత మంది మృగాళ్లు.  ప్రతి రోజు ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో అడవారిపి అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు.  తాజాగా కుటుంబ పోషణ కోసం ఓ వస్త్రదుఖాణంలో పనిచేస్తున్న వివాహితను తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కోరాడు ఓ కామాంధుడు.  అంతే కాదు ప్రతిరోజూ  తన కోరిక తీర్చాలంటూ వెంటపడుతున్నాడు. అయితే అతని  పట్టించుకోకపోవడంతో ఆ దుర్మార్గుదు మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.  తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో ఈ ఘటన జరిగింది. 

 


వివరాల్లోకి వెళితే.. రాయవరానికి చెందిన ఓ వివాహిత తన కుటుంబాన్ని పోషించుకునేందుకు స్థానికంగా ఓ వస్త్ర దుఖాణంలో రెండుళ్లుగా సేల్స్ గర్ల్ గా పని చేస్తుంది. గత కొంత కాలంగా ఆమెను వెంటాడుతున్న చంద్రమళ్ల సుబ్బారావు తన కోరిక తీర్చాలని తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధించసాగారు. అయితే ఈ విషయం పెద్దవాళ్ల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. బుధవారం రాత్రి షాపు నుంచి ఇంటికి వెళ్తున్న ఆమెపై నిర్థాక్షిణ్యంగా బ్లేడుతో గొంతుపై ఇతర చోట్ల దాడి చేశాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడం..గట్టిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్నవారు అతన్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. ఆ వివాహితను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: