ఈ మద్య కాలంలో మానవ సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా క్షణిక సుఖానికి తెగపడి అక్రమ సంబంధాలు కొనసాగించిన వారి జీవితాలు చివరికి అర్థాంతరంగా చనిపోవడం..జైలుకు వెళ్లడం జరుగుతుంది. ఇలాంటి దారుణాల వల్ల ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆడవారిపై అత్యాచారాలు కూడా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. చిన్నా పెద్ద అనే వయసు తో సంబంధం లేకుండా లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది ఆడవాళ్లు సైతం అక్రమ సంబంధాలతో కట్టుకున్న భర్తలను ప్రియుడితో దారుణంగా చంపించిన ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.
తాజాగా తనను నమ్మి వచ్చిన మహిళను శృంగారం చేసి దారుణంగా సుత్తితో తలపై మోది చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలోని కుంట్లురు గ్రామ శివారులో దారుణహత్యకు గురైన కేసులో పోలీసులు చేధించారు. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం గ్రామానికి లింగమ్మ(50) పదేళ్ల క్రితం భర్తతో విడిపోయి హైదరాబాద్ వచ్చేసింది. ఈ క్రమంలో ఆమెకు యూపీకి చెందిన ఓ వ్యక్తితో పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. తరుచూ లింగమ్మ ఇంటికి వెళ్లే రమేశ్ ఆమెతో శృంగారంలో పాల్గొనేవాడు. అదే సమయంలో అతని కన్ను ఆమె నగలపై పడింది. ఆ నగలు అమ్ముకుని తన అప్పులు తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు.
తాను అనుకున్నట్లుగానే లింగమ్మ అతన్ని ఈ నెల 11వ తేదీన రమ్మని పిలవడంతో..రాజ్భవన్ రోడ్లోని రైల్వే క్రాసింగ్ వద్దకు రమ్మన్నాడు. ఆమెను బైక్ ఎక్కించుకుని నాగోలు తీసుకొచ్చాడు. అక్కడ కల్లు తాగించి..కుంట్లూరు దారిలో నిర్మానుష్య ప్రాంతంలో తీసుకు వెళ్లి శృంగారం చేసి తర్వాత సుత్తితో తలపై మోది, గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఒంటిపై ఉన్న నగలను దోచుకుని వెళ్లిపోయాడు.
కుంట్లూరులోని వ్యవసాయ బావి వద్ద పశువులను మేపుతున్న నర్సింహారెడ్డి అనే వ్యక్తి లింగమ్మ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే మృతురాలి లింగమ్మ కాల్ డేటా పరిశీలించిన పోలీసులు రమేశ్ ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు కక్కాడు. తాజాగా పోలీసులు రమేశ్ దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.