వెనకటికి ఎవ్వడో అన్నాడట.. మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టాడని.. ఇప్పుడు అక్షరాల అలాగే వ్యవహరిస్తున్నాడు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్బాబు. ఏపీలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. టీడీపీ అధికార పక్షంపై చేస్తున్న విమర్శలు తీరు కూడా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు చూస్తున్నా.. వ్యవహరిస్తున్న తీరు గమనిస్తున్నా రాబోవు రోజుల్లో ఎవ్వరు చనిపోయినా ఏదో కారణం చెప్పి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేషాలు చేసిన పని కూడా అచ్చు అలాగే ఉంది. ఇలా చేస్తే కనీసం ప్రజల్లో ఉన్న కాస్త గౌరవం పోతుందనే కామన్సెన్స్ కూడా లేకుండా పోయింది లోకేషాలుకు. ఇంతకు నారా లోకేషం చేసిన పని, అధికార పార్టీని తప్పు పట్టే ప్రయత్నం చూస్తే నవ్వుల పాలు కాకతప్పదు.
నారా లోకేష్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఆత్మకూరు గ్రామానికి చెందిన స్వర్ణకారుడు వెంగల శివ ఆత్మహత్య చేసుకున్నాడు. శివ ఆర్థిక ఇబ్బందులో, లేక కుటుంబ కారణాలో మరేదైనా కావొచ్చు ఆత్మహత్య చేసుకున్నాడు. శివ టీడీపీకి చెందిన వ్యక్తి. ఆ మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ నేతగా శివ ఇంటికి చేరుకున్నాడు. కుటుంబాన్ని ఓదార్చాడు. నేనున్నాని భరోసా ఇచ్చాడు. కుటుంబానికి రూ.50వేలు సాయం చేశాడు. ఇద్దరు పిల్లల చదువుకు సాయం చేస్తామని మాటిచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే శివ ఎలా చనిపోయాడు అని శివ తల్లిని అడిగాడు. శివ తల్లి పనులు లేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, తినేందుకు తిండి లేక చనిపోయాడు అని లోకేష్కు చెప్పింది.
అయితే అక్కడే ఉన్న టీడీపీ నేత ఒకరు రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది అనడం.. దీనికి లోకేషాలు అవును ఐదారు నెలల నుంచి ఇసుక కొరత ఉంది ఇసుక కొరతతో పనులు లేక చనిపోయాడా.. ఓ అసలు కథ ఇదా.. ఇదంతా లింక్ సిస్టమ్ కదా.. ఇసుక లేక పోవడంతో పనులు ఆగిపోయాయి.. పనులు లేక ఎవ్వరు బంగారం పనులు చేయించుకోవడం లేదు.. దీంతో శివకు ఉపాధి లేకుండా పోయింది.. అందుకే శివ చనిపోయాడని టీడీపీ నేతలు చెప్పడం, లోకేషాలు అవును అనడం.. ప్రభుత్వం ఇసుక సరఫరా చేయకపోవడంతోనే చనిపోయాడు అని చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఇది చూస్తేంటే మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టిన చందంగా ఎవ్వరికైనా అనిపించక మానదు.
లోకేషాలు చేస్తున్న ఈ పిల్ల చేష్టల పనులు, విమర్శలు చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేమి అన్నట్లుగా అనిపిస్తుంది. ఏపీ ప్రజలు ఏమైనా అనుకోని.. ఎవ్వరు ఎలా చనిపోయినా దాన్ని ప్రభుత్వ ఖాతాలో వేయడం, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం... ఆపై రాక్షసానందం పొందడం ఇదే మాపని అనిపిస్తున్నారు. ఇలా చేస్తే ఏపీలో టీడీపీ నవ్వులపాలు కాకతప్పదు మరి. ఇకనైనా టీడీపీ నేతలు విమర్శలు చేసినా.. ప్రభుత్వాన్ని నిందించాలంటే వాస్తవాలను వెలికితీసి విమర్శలు చేస్తే జనాల్లో పలుకుబడి పెరుగుతుంది. విశ్వసనీయత పెరుగుతుంది. తద్వారా పరపతి పెరుగుతుంది.. ఓటు బ్యాంక్ పెరుగుతుంది. చౌకబారు విమర్శలు చేస్తే ప్రజల చేతుల్లో చావు దెబ్బ తినడం ఖాయం.. ఏపీలో పచ్చపార్టీ కనుమరుగు కావడం ఖాయం.