తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అత్తగారింటికి వచ్చిన అల్లుడు భార్య, పిల్లలపై పెట్రోల్ తో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం పల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. గంగాధర మండలం మణికొండ గ్రామానికి చెందిన లక్ష్మీరాజం అనే వ్యక్తి తన భార్య విమల, ఇద్దరు కుమర్తెలు, బావమరిది రాజు, మరదలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెండు నెలలుగా కాపురానికి రావట్లేదని విమల భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
లక్ష్మీరాజం చేసిన దాడిలో భార్య, కూతురితో పాటు బావమరిది తీవ్రగాయాలపాలయ్యారు. కాపాడేందుకు ప్రయత్నించిన సునీత, రాజేశ్వరి కూడా గాయాలపాలయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ కు వీరిని తరలించారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో వీరికి చికిత్స జరుగుతోంది. విమల కుటుంబ సభ్యులంతా నిద్రిస్తుండగా ఈ దారుణం జరిగింది. 
 
నాలుగు సంవత్సరాలుగా విమల, లక్ష్మీరాజం మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ విబేధాల వలన లక్ష్మీరాజం విమలతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై, కుమార్తెలపై దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కూడా దారుణం చోటు చేసుకుంది. 
 
కొడుకు కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో ఈ దారుణం జరిగింది. కొడుకు మల్లేశం తండ్రి చంద్రయ్యను గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక భూ వివాదం కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత కొన్ని నెలల నుండి తండ్రీకొడుకుల మధ్య భూ వివాదానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: