అందమైన అమ్మాయి..కన్ను గీటితే పడిపోని మగాడు ఉండడు..అదే ఆ అమ్మయి స్వర్గసుఖాలు అందిస్తే..ఇక మగాడి సంతోషానికి ఆనందానికి అవధులు ఉండవు.  దానికోసం ఎంతకైనా తెగిస్తారు..ఎంతైనా ఖర్చు చేస్తారు.  ఇదే వీక్ పాయింట్ పై ఇప్పుడు కొంత మంది దళారులు మసాజ్ పార్లర్ పేరిట విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న సెక్స్ రాకెట్ దందా చేస్తు ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదిస్తున్నారు. 

 

దేశ వ్యాప్తంగా ఈ దందాలు ఒకప్పుడు పెద్ద నగరాల్లోనే సాగేవి..కానీ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం విస్తరిస్తున్నాయి. ఇందుకోసం కొంత మంది దళారులు గ్రామీణ స్థాయిలో ఉండే అమ్మాయిలు, వైవాహిక ఇబ్బందులు ఆడవాళ్లు, విదేశీ యువతులను ట్రాప్ లోకి లాగుతున్నారు.  పోలీసులు మసాజ్‌ సెంటర్‌ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాల గుట్టు ఎన్నిసార్లు రట్టు చేసినా విడుదలైన తర్వాత మళ్లీ అదే దందాలు చేస్తున్నారు. 

 

ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు ఎన్నోసార్లు రట్టు చేశారు పోలీసులు. అయితే మసాజ్ పేరిట  హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని, పలు ఫిర్యాదుల అందిన నేపథ్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విటులను సోషల్ మీడియా, మొబైల్ యాప్స్ ద్వారా ఆకర్షిస్తూ, హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

ఇక విజయవాడలో తొలిసారి స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తూ కొంత మంది అమ్మాయిలు విటులతో పట్టుబడిన విషయం తెలిసిందే. ఇటీవల విజయవాడలో టాస్క్ ఫోర్స్ అధికారులు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. మసాజ్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేశారు. థాయ్ లాండ్ కు చెందిన నలుగురు యువతులతో పాటు ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  ఏది ఏమైనా కొంత మంది డబ్బు సంపాదన కోసం..లగ్జరీ జీవితం గడపడం కోసం దేనికైనా తెగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: