స‌మాజంలో రోజు రోజుకు మైన‌ర్ల‌కు మాయ‌మాట‌లు చెప్పి వ‌ల‌లో వేసుకుని వారి జీవితాలు నాశ‌నం చేసే మృగాళ్లు, కామాంధులు ఎక్కువ అవుతున్నారు. తాజాగా ఓ కామాంధుడి మాయమాటలు విన్న ఇంటర్ బాలిక జీవితాన్ని నాశనం చేసుకుంది. నీ చ‌దువు అయ్యాక నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్య‌త నాది అని చెప్పడంతో అత‌డి మాయ మాట‌లు విన్న ఆ బాలిక అత‌డికి లొంగి పోయింది. ఇదే అద‌నుగా ఆ కామాంధుడు ఆ బాలిక‌ను ఆమెను లైంగికంగా లోబరుచుకున్నాడు. రెండు గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడు. చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

అనంతపురం జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని ఓ గ్రామంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఈ మండ‌లంలోని ఓ పంచాయ‌తీ ప‌రిధిలో ఉండే ఓ బాలిక స‌మీపంలోని జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఇంట‌ర్ చ‌దువుతోంది. ఆమె ప్ర‌తి రోజు కాలేజ్‌కు వ్యాన్‌లో వెళ్లి వ‌స్తుండేది. 16 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న ఈ బాలిక అమాయ‌క‌త్వాన్ని ఆస‌ర‌గా చేసుకున్న వ్యాన్ డ్రైవ‌ర్ ములకలచెరువు మండలం దాసిరెడ్డిగారిపల్లెకు చెందిన మల్లికార్జున ఆమెపై క‌న్నేశాడు.

 

నీ చ‌దువు పూర్త‌యిన వెంట‌నే నీకు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని...  పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాలా సార్లు ఆమెను కాలేజ్‌కు తీసుకు వెళ్ల‌కుండా త‌న ఫ్రెండ్స్ రూమ్స్‌తో పాటు నిర్మానుష్య ప్ర‌దేశాల‌కు.. సినిమాల‌కు.. షికార్ల‌కు తీసుకువెళ్లి ప‌లుసార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ క్రమంలోనే బాలిక రెండుసార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు.

 

ఇటీవ‌ల బాధితురాలు త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని మ‌ల్లిఖార్జున‌పై ఒత్తిడి తేవ‌డం ప్రారంభించింది. మ‌ల్లిఖార్జున ఒప్పుకోలేదు. చివ‌ర‌కు అత‌డి గురించి ఆరా తీయ‌గా అత‌డికి అప్ప‌టికే పెళ్ల‌య్యి... హైస్కూల్ చదువుతున్న పిల్లలున్నారని తెలుసుకున్న బాలిక తాను మోసపోయానని తెలుసుకుంది. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా... బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మల్లికార్జునపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: