ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేసే చట్టాలు ఎలా ఉన్నాయంటే అవి జనానికి ఎంతలా ఉపయోగపడుతున్నాయని ఆలోచించే కంటే,  ప్రభుత్వానికి ఎంతలా ఆదాయాన్ని సమకూర్చు తున్నాయని నిర్ణయించే ప్రవేశ పెడుతున్నట్లుగా ఉన్నాయి. ఆకోవకే చెందింది కొత్త మోటారు చట్టం..

 

 

ఎప్పటికి  ఈ పేరు ఎత్తగానే వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉంటాయి. ఇకపోతే ఈ చట్టం ప్రమాదాల నుంచి రక్షించడం మాట ఏమో కానీ ప్రభుత్వానికి మాత్రం భారీగా ఆదాయం సమకూర్చిపెట్టింది.

 

 

సెప్టెంబర్‌ 1 నుంచి ఇప్పటి వరుకు వివిధ రకాల జరిమానాల రూపంలో మొత్తం 38 లక్షల ట్రాఫిక్‌ చలాన్లు జారీ చేసినట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఈ చలానాల ద్వారా మొత్తం రూ.577.5 కోట్ల జరిమానా విధించినట్టు చెప్పారు.

 

 

కాని ఈ చట్టం వల్ల ఎంత మంది వాహనదారులు లాభపడ్డారో చెప్పలేదు. ఎందుకంటే నిజంగా లాభపడిన వారు లేరు గనుక ఇంకేం చెబుతారు. ఇంతకు ఈ విషయం ఎలా బయటకు పొక్కిందంటె లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.

 

 

ఇక దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ జరిమానాలు విధించినట్టు చెప్పారు. ముఖ్యంగా తమిళనాడులో అత్యధికంగా 14,13,996 చలాన్లు జారీ చేయగా.. అత్యల్పంగా గోవాలో 58 చలాన్లే జారీ అయ్యాయని తెలిపారు.

 

 

కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అక్కడి ప్రభుత్వాలు ప్రజల వెసులుబాటుకోసం జరిమానాలు తగ్గించాయని చెప్పారు. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలు విధించడంలో పాత జరిమానాల పద్దతులనే  కొనసాగిస్తున్నారని అన్నారు.

 

 

చూసారా వాహనచోదకులనుండి ముక్కు పిండి మరీ వసూలు చేసిన సొమ్ము కేంద్రానికి ఎంతగా లాభాలు పండించిందో చలానా రూపంలో ఖజానా ఎలా నింపుకున్నారో. కేంద్రం తనకు ఏ లోటు లేకుండా ముందు జాగ్రత్తగా ఆదాయాన్ని సమకూర్చుకుంది కాని పాలకులు ప్రజల గురించి కూడా ఇలాగే ఆలోచిస్తే సామాన్యూడు భయపడుతూ బ్రతికే పరిస్దితులు తలెత్తవుకదా అని అనుకుంటున్నారు మధ్యతరగతి ప్రజలు..  

మరింత సమాచారం తెలుసుకోండి: