ఈ మద్య కొంత మంది మనుషులు ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు.  సంబంధ బాంధవ్యాలను మంట కలుపుతున్నారు. దైవ సాక్షిగా..  పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఏకమైన భార్య భర్తలు అక్రమ సంబంధాలతో ఒకరినొకరు దారుణంగా చంపుకుంటున్నారు.  సభ్య సమాజం తలదించుకునేలా ఓ మహిళ చేసిన అఘాయిత్యానికి పోలీసులు సైతం నివ్వెరపోయారు.  కట్టుకున్న భర్తను దారుణంగా చంపిన ఆమె వంటగదిలోనే పాతి పెట్టి ఎప్పటిలాగే వంటచేసుకుంటూ జీవిస్తున్న మహిళను మధ్యప్రదేశ్ పోలీసులు నాటకీయ ఫక్కీలో అరెస్టు చేశారు. 

 

ఈ దారుణమైన ఘటన అనుప్పూర్ జిల్లాలోని కరోండి గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..అనుప్పూర్ జిల్లాలోని కరోండి  గ్రామానికి  చెందిన మహేష్ బన్వాల్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.  కొంత కాలం క్రితం ఆయనకు ప్రమీళతో వివాహం జరిగింది.  భార్యభర్తల మద్య అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వస్తుండేవి.  ఈ క్రమంలోనే మహేష్ సోదరుడు గంగారం తో ప్రమీలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వీరి అక్రమ సంబంధానికి మహేష్  బన్వాల్ అడ్డు వస్తున్నాడని అతని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

 

ఈ క్రమంలో  మహేష్ బన్వాల్ గతనెల 22 నుంచి కనపించకుండా పోయాడని అతని భార్య ప్రమీల ఫిర్యాదు చేసిందని తెలిపిందన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  అయితే ప్రమీలపై మహేష్ సోదరుడు అర్జున్ బన్వాల్ కి అనుమానం వచ్చింది.  ఈ నేపథ్యంలో ప్రమీల ఇంటిని తనిఖీచేస్తున్నసమయంలో, వంటగదిలోంచి దుర్వాసన రావడంతో అనుమానంతో అక్కడ తవ్విచూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహేశ్ శవాన్నిగుర్తించి వెలికి తీశామన్నారు. తర్వాత పోలీసులు తమదైన శైలిలో ప్రమీళను విచారించారు.  దాంతో విసృతపోయే నిజాలు వెల్లడించింది. తనకు గంగారాంతో అక్రమ సంబంధం ఉందని.. గంగారం బన్వాల్ ఈ హత్య చేయడానికి తనకు సహాయం చేశాడని నిందితురాలు పేర్కొందన్నారు.  హత్య చేసి వంటింటిలోనే పూడ్చి పెట్టామని చెప్పింది. ప్రమీలను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: