సమాజంలో కొందరు పెద్దలు అని చెప్పుకునే గద్దలు చేసే నీతిమాలిన పనులను చూస్తుంటే అసహ్యమేస్తుంది. తమ వయస్సు మరచి ఆదుకొమ్మని వచ్చిన మహిళను అరాచకంగా మోసం చేసి తమ కామ వాంఛ తీర్చుకున్నారు. వయస్సుతో పాటుగా బుద్ధి పెరగాలని అంటారు. కాని కొందరిలో వయస్సుతో పాటుగా కోరికలు పెరుగుతూ వారిని దావాగ్నిలా దహిస్తూ చేయకూడని పనులను వారితో చేపిస్తున్నాయి.

 

 

సమాజంలో కుల పెద్దలు అని చెప్పుకునే వారు ఆ పెద్దరికాన్ని అడ్డం పెట్టుకుని నీచానికి దిగజారుతున్నారు. అది వారి వయస్సు మరచి. ఒక మహిళ అవసరం వారు అవకాశంగా మలచుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో 50ఏళ్ల మహిళపై ఇద్దరు వృద్ధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

 

 

జిల్లాలోని ధర్నాల్ గ్రామానికి చెందిన ఈ మహిళ కుమారుడు మరొక సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో  ఈ మహిళ కుటుంబాన్ని కుల పెద్దలు వెలి వేశారు. ఈ క్రమంలో తమ కొడుకు చేసిన తప్పును క్షమించి తమను వెలి నుంచి తప్పించాలని ఆ మహిళ కుల పెద్దలైన రాంచోద్భాయ్ సుతార్(65), వోల్భాయ్ సుతార్(64) లను నెల రోజుల క్రితం కోరింది. దీనిని అవకాసంగా తీసుకున్న వారు తమకు లైంగిక సుఖాన్ని అందిస్తే వెలి తొలగిస్తామని చెప్పారట.

 

 

మహిళ తిరస్కరించిన బెదిరించి ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారట. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా తమను వెలి నుండి తప్పించలేపోవడమే కాకుండా తరుచూగా తమ కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టారట ఆనీచులు. వీరి వేధింపులు తట్టుకోలేక విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి అందులో తాను వారి నుండి కుల పెద్దల నుంచి ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నదీ వెల్లడిస్తూ ఓ ఆడియో క్లిప్‌ను కూడా పోలీసులకు అందజేసిందట. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి నిందితులను  అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: