చంద్రబాబే గండరగండరు అనుకుంటే ఆయన కుమారుడు ఇంకానా. బాబు ఎవరికీ భయపడరు, తాను నిప్పు అని అంతా అంటారు, అంటువంటి బాబును కూడా  ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయగలరా. బాబుని అలా చేసినది కూడా పుత్రరత్నమేనా . మరి ఎందుకు బాబుని బ్లాక్ మెయిల్ చేశారు, ఏ విషయంలో చేశారు. లోకేష్ కి ఆ అవసరం ఎందుకు వచ్చింది, ఎపుడు వచ్చింది, ఇవన్నీ ప్రశ్నలే. 

 

మరి వీటికి జవాబు వైసీపీ మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. ఏ అర్హతా లేకుండానే దొడ్డి దారిన అయిదు శాఖలతో మంత్రి పదవిని దక్కించుకున్న లోకేష్ అసలు కధను నాని మీడియాకు చక్కగా వినిపించేసారు. లోకేష్ కి మంత్రి పదవి ఎలా వచ్చిందంటే బాబుని బ్లాక్ మెయిల్ చేసి అని కొడాలి నాని అంటున్నారు. బాబును  పూర్తిగా బ్లాక్ మెయిల్ చేసి మంత్రి పదవి ఇవ్వకపోతే ఊరుకోనని లోకేష్ అనబట్టే బాబు ఆయనకు పదవి కట్టబెట్టాడని నాని అంటున్నారు.

 

లోకేష్ కంటే సైకో ఎవరూ కూడా దేశంలో లేరని నాని అంటున్నారు. లోకేష్ సైకోని బాబే భరించలేకపోతున్నారని కూడా కొడాలి నాని సెటైర్లు వేశారు. మంగళగిరిలో మంత్రిగా ఉంటూ ఓటమి పాలు అయిన లోకేష్  ఆ అవమానం కూడా లేకుండా మాట్లాడుతున్నారని దుమ్ము దులిపేశారు లోకేష్ కి తిన్నది అరక్క మాట్లాడితే వైసీపీ చూస్తూ సహించేది లేదని ఆయన అన్నారు. 

 

జగన్ కుటుంబం గురించి ఒక్క మాట అంటే తాము అసలు సహించమని కూడా ఆయన అన్నారు.  లోకేష్ కి తెలివి తేటలు వైసీపీ మీద చూపించవద్దని కూడా హెచ్చరించారు. బ్యాంకులను లూటీ చేసిన సుజనా చౌదరి నీతులు చెబితే వినే వారు ఎవరూ లేరని ఆయన అన్నారు. బీజేపీలో సుజనా చౌదరి స్థాయి ఏంటి, ఆయన ఒక ఎంపీ మాత్రమేనని , అగ్ర నాయకుడా అంటూ కొడాని నాని హాట్ కామెంట్స్ చేశారు. సుజనా చౌదరికి ఎవరు ఎందుకు టచ్ లో ఉంటారని కూడా ఆయన నిలదీశారు. బ్యాంక్ దొంగ అంటే గూగుల్లో సుజనా పేరు వస్తోందని కూడా  కొడాలి నాని సెటైర్లు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: