తెలంగాణలో ఆర్టీసీ విలీనం పక్కన పెడితే ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. సుమారు ఐదు వేల రూట్లను ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. హై కోర్ట్ కూడా ప్రైవేటీకరణకు సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆర్టీసీ నాయకులు ఏం చేయబోతున్నారని ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 50 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడం తో కొంత నిరాశలో ఉన్న కార్మికులకు తాజాగా మరో షాక్ తగిలింది. సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 5100 బస్సులను ప్రైవేట్కు అప్పగిస్తూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న విషయం తెలిసిందే.

 

ఇదే క్యాబినెట్ నిర్ణయాన్ని కోర్ట్ లో సవాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీనిపై ఆర్టీసీ కార్మికులు హై కోర్ట్ లో పిటిషన్ వేయగా ..  కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేస్తూ ..పిటిషన్ ని కోర్ట్ కొట్టివేసింది. దీనితో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అయ్యింది.  గతంలో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టిన కోర్టు.. ఇవాళ వాదప్రతివాదనలు విన్న తర్వాత ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో రూట్ల ప్రైవేటీకరణ అమలు బాధ్యత ఎవరికి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించగా .. రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం అప్పగిస్తున్నట్టు.. కేబినెట్ తీర్మానంలో ఉందని కోర్టుకి తెలిపారు. మొత్తంగా పిటిషన్ ని కొట్టి వేయడం తో ప్రైవేటీకరణ పనులు వేగవంతమైయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  



దీనితో ఆర్టీసీ కార్మికులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ తీర్పు నేపథ్యంలో  ఆర్టీసీ భవితవ్యం కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇటు కార్మికులు..అటు ప్రజల లోను  ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో  మరి. అలాగే  ప్రభుత్వం కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవటం కూడా కష్టమే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: