ఇప్పుడున్న పరిస్దితుల్లో ఏపీలో ఇసుక బంగారంతో సమానమైంది. ఈ ఇసుకపై ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీలు నానా రగడ చేస్తూ  ప్రభుత్వాన్ని తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే అన్ని తెలిసి కూడ ఇసుక దొంగతనం చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో అతన్ని హజరుపర్చగా అతనికి కడప కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది.

 

 

ప్రజల ఆస్తికి నష్టం కలిగించినందుకు ప్రజా ఆస్తి విధ్వంస నిరోధక చట్టం (పీఓపీపీడీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా కూడా విధించింది. అంతే కాకుండా ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కడప జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ పి.భానుసాయి రెండు రోజుల క్రితం ఈ తీర్పు వెలువరించారు.

 

 

ఇకపోతే ఇప్పుడు ఏపీలో అక్రమంగా ఇసుకను నిల్వ చేసినా, రవాణా అక్రమంగా చేసినా, లేదా బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించినా, ఒకరి పేరిట కొని, మరొకరికి అమ్మినా రెండేళ్ల జైలు, రూ.2 లక్షల జరిమానా విధించేలా చట్ట సవరణ చేసేందుకు ఈ నెల 13న  రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కొద్ది రోజులకే ఈ తీర్పు వెలువడటం విశేషం.

 

 

ఇకపోతే వైఎస్సార్‌ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లికి చెందిన నంద్యాల సుబ్బారాయుడు  ఈ ఏడాది జూలై 15న పాపాగ్ని నదిలో ఇసుకను దొంగిలిస్తున్నారంటూ పెండ్లిమర్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సుబ్బారాయుడు ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ట్రాక్టర్‌లో ఇసుకను లోడ్‌ చేస్తూ సుబ్బారాయుడు కనిపించాడు. అతడని పోలీసులు పట్టుకొని విచారణ చేసి కోర్టుకు రిమాండ్ చేయగా కోర్టు అతనికి జైలు శిక్షతోపాటుగా జరిమాన విధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: