వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీమ్ కోర్టు ఎప్పుడు చెప్పిందో కానీ అప్పటి నుంచి.. మన దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పోరిగిపోతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని చైతన్యపురి లో ఒక ఎన్ఆర్ఐ భార్య నివసిస్తుంది. ఆమె భర్త ఆస్ట్రేలియా లో ఉన్నపటికీ..... భార్య చేసే కార్యకలాపాలను తెలుసుకోవడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ ఏర్పాట్ల సహాయంతోనే అతని భార్య ఒక డాక్టర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందనే విషయం తెలుసుకున్నాడు. వెంటనే ఆస్ట్రేలియాలో విమానం ఎక్కి ఇండియాలోని శంషాబాద్‌ లో ఉన్న ఎయిర్ పోర్టులో దిగాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనతో పాటు కొంతమంది పోలీసులను వెంట పెట్టుకొని చైతన్యపురిలోని అతని ఇంటికి బయలుదేరాడు.

అతని భార్య ఉంటున్న ఇంటికి వచ్చిన పోలీసులు.... తలుపులను టపటపా కొట్టారు. దీంతో భయబ్రాంతులకు గురైన ఎన్ఆర్ఐ భార్య వెంటనే తలుపులు తీసింది. ఇంటి లోపలికి వెళ్లిన పోలీసులకు..... ఆమె ఒక డాక్టర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని ఫుల్ క్లారిటీ వచ్చింది.. ఎన్ఆర్ఐ ఇచ్చిన కేసుతో... భార్యని, డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇక్కడే పోలీసులకు మరో ట్విస్ట్ తగిలింది. పోలీసులు... పక్క ఇంట్లో ఎవరుంటున్నారని అడిగారు. వాళ్లకేదో డౌట్ వచ్చి అలా అడిగారు. అప్పుడు ఎన్ఆర్ఐ...ఎవరో ఉంటున్నారనుకుంటా అని తెలిసి, తెలియని సమాధానం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ పక్కింటి తలుపులు కొట్టారు.. లోపలనుంచి ఓ జంట భయపడుతూ.. కంగారుపడుతూ.. బయటకి వచ్చారు. 'మీరు భార్యాభర్తలా' అని పోలీసులు వారిని ప్రశ్నించగా... వారు ఏం మాట్లాడకుండా బిక్కమొహం వేశారు. 'ఏంటి విషయం, మీరు భార్యభర్తలా, కాదా త్వరగా చెప్పండి?' అని గట్టిగ అడిగేసరికి.... తాము భార్యాభర్తలం కాదనీ... తమది వివాహేతర సంబంధం అనీ తెలిపారు. ఇది విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.. ఇక్కడ కూడా సేమ్ అదే కథ అంటూ సెటైర్ వేశారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 'వివాహేతర సంబంధం' 2018 నుంచి నేరంగా పరిగణించకపోవడంతో ఇప్పుడు దొరికిన ఈ రెండు జంటల కేసుల్లో పోలీసులు ఎలా ముందుకెళ్తారో తేలాల్సిన అంశం.  

మరింత సమాచారం తెలుసుకోండి: