విజయవాడ హైటెక్ వ్యభిచారానికి అడ్డా గా మారింది. విదేశి యువతులను విమానాల్లో విజయవాడ కు రప్పించి మరీ వ్యభిచారం చేయిస్తున్నారు నిందితులు ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు వ్యభిచార గృహం పై రైడ్ చేసి 17 ఏళ్ళ బంగ్లాదేశ్ బాలికను అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహాన్ని నడుపుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

బంగ్లాదేశ్ లోని జూత్‌పూర్‌కి చెందిన 17 ఏళ్ల బాలికకు భారీగా డబ్బు ఆశ చూపి విజయవాడ తీసుకొచ్చినట్లు వెల్లడైంది. ఆరునెలలకు నెలకు రూ 50 వేళ చొప్పున మొత్తం ఆరు నెలలకు మూడు లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ఆమెను సరిహద్దు దాటించి కోల్‌కతా వరకు చేర్చారు. అక్కడి నుంచి రాహుల్, ప్రియ అనే మరో ఇద్దరు బాలికను విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి జనార్ధన్ అనే వ్యక్తి జత కలిశాడు. హైదరాబాద్ లో కొన్ని రోజులు బాలిక తో వ్యభిచారం చేయించారు.

జనార్థన్, ప్రియ కలిసి బాలికను విజయవాడ కు పంపారు విజయవాడలో బస్సు దిగిన బంగ్లాదేశ్ బాలికను సూరవరపు మహేష్ అనే వ్యక్తి వరప్రసాద రెడ్డి అనే మరో వ్యక్తితో కలిసి బాలికతో వ్యభిచారం చేయిస్తున్నాడు. ఇలా బాలికతో 17 రోజుల పాటు వ్యభిచారం చేయించారు నిందితులు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటికి రోజూ జనం వచ్చిపోతుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ముఠా గుట్టురట్టైంది. పోలీసులు బాలికతో పాటు నిందితులు ప్రసాద్‌రెడ్డి, మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక మైనర్ కావడంతో వైద్య పరీక్షల అనంతరం జువైనెల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇక పోలీసుల విచారణ లో బాలికకు పెళ్లి అయిందని ఒక కుమారుడు కూడా ఉన్నట్లు తెలిసింది. డబ్బులు ఆశగా చూపి బాలికను లొంగతీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: