రోజురోజుకు విద్యార్థులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పి సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు కీచకులకు మారి అఘాయిత్యాలకు  పాల్పడుతున్నారు. సద్బుద్ధి  నేర్పాల్సిన గురువులే... బుద్ధి లేకుండా రాక్షసులుగా మారి విద్యార్థులపై కామవాంఛ  తీర్చుకుంటున్నారు. మీరు మా గురువు సార్... తండ్రితో సమానం నన్ను ఇలా చేయడం తగదు అంటూ  విద్యార్థులు కాళ్ళ వేళ్ళ పడుతున్న కూడా... కాస్తయినా దయ లేకుండా కళ్ళు మూసుకుపోయి రాక్షసుల్లా  మారుతున్న ఉపాధ్యాయులు పశువుల్లా  విద్యార్థుల మీద పడి కామవాంఛను తీర్చుకుంటున్నారు . ఇప్పటికే చిన్నారుల  దగ్గర నుంచి పండు ముసలి వరకు బయట ఆకతాయి నుంచి మృగల్లాంటి  మగాళ్ల  నుంచి రక్షణ కరువు అవుతుంటే... దేవాలయం లాంటి స్కూళ్లు,  పాఠశాలల్లో కూడా విద్యార్థులకు రక్షణ కరువవుతోంది. దీంతో ప్రస్తుతం చదువుకోవడానికి స్కూలుకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది విద్యార్థులకు. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు తమకు చదువు చెప్పే గురువులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అత్యాచారాలు చేస్తున్నారంటూ బాధలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. 

 

 పదవా  తరగతి విద్యార్థిపై కీచక ఉపాధ్యాయుడు గత రెండేళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నారు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిపై గత రెండేళ్లుగా ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రధాన ఉపాధ్యాయుడుకి  భార్య కూడా అతనికి సహకరించినట్లు  సమాచారం. బాధిత బాలికను ప్రధానోపాధ్యాయుడు భార్య తన ఇంటికి పిలిచి  ఇంటి పనులు కూడా చేస్తుందని చేయకపోతే వేధింపులకు గురి చేసిందని సమాచారం. అబ్దుల్లాపూర్మెట్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. పదవ తరగతి విద్యార్థినిపై  కీచక ఉపాధ్యాయుడు గత రెండేళ్లుగా ఆ విద్యార్థి పై అత్యాచారానికి  పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామంతపూర్ లోని వెంకట్రెడ్డి నగర్ కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన కూతురిని అబ్దుల్లాపూర్మెట్ జానెట్ జార్జి నాలుగవ తరగతి లో చేర్పించారు. అయితే ఆ బాధిత బాలిక నాలుగవ తరగతి నుంచి అక్కడి స్కూల్ హాస్టల్ లోనే ఉంటూ చదువుకుంటుంది. ప్రస్తుతం ఆ బాలిక పదవ తరగతి కి చేరుకుంది.

 

 అయితే ఆ బాలికపై ఎన్నో రోజుల నుండి కామవాంఛ  పెంచుకున్న ఆ కీచక ఉపాధ్యాయుడు ఆ బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో  దసరా సెలవులకు ముందు  ఆ బాలిక ఉంటున్న రూమ్ లోకి రహస్యంగా చొరబడి ఆ బాలికపై అప్పుడే మొదటిసారి అత్యాచారం లైంగిక దాడికి పాల్పడి అత్యాచారం  చేసాడు . ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆ బాలికను లైంగికంగా మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు ఆ కీచక టీచర్. అంతే కాదు అదే సంస్థలో పని చేసే నిందితుడి  భార్య కూడా బాలికపై వేధింపులకు పాల్పడడం గమనార్హం. ఆ బాలికతో ఇంట్లో వెట్టిచాకిరీ చేయించుకొన్న నిండుతుంది  భార్య ఒకవేళ ఆ బాలిక ఏదైనా చేయలేను అని చెప్తే తీవ్రంగా కొట్టి మరీ హింసించేది .వేధింపులు  రోజురోజుకు ఎక్కువవుతుండంతో భరించలేకపోయింది. దీంతో హాస్టల్ ను వేడి ఇంటికి చేరి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వెల్లడించింది. తనపై ఉపాధ్యాయుడు చేసిన ఆకృత్యాలను తల్లిదండ్రులకు వివరించిన బాలిక... తనతో పాటు ఇంకొంత మంది విద్యార్థులపై కూడా ఇలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయని తెలిపింది . దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: