ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ... సుజనా చౌదరి  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరిస్తే  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారని  ఆయన అనుకుంటున్నారని  అన్నారు. ఆయన ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన బీజేపీతో టచ్‌లో ఉన్నారని ,నచ్చినట్టు ఏమంటే అవి అనడం భావ్యం కాదని ఆయన పేర్కరొన్నారు.

 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు ఎవరూ కూడా అప్పుడు ఎలాంటి  సందర్భం ఎదురైనా  పార్టీ మాత్రం మారరని స్పష్టం చేశారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని ఇప్పటికైనా మానుకోమని  ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. 20మంది టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకువెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సుజనా చౌదరికి సూచించారు. 

 

 సుజనా చౌదరి చేసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఆరోపణల్లో వాస్తవం లేనందునే తాను వివరణ ఇస్తున్నానని అన్నారు. ఇలా లేనిపోని మాటలు మాట్లాడం  వల్ల ఏమీ లాభం లేదని,మీకు నచ్చిన విధంగా  ఊహాజనితంగా మాట్లాడటం సబుబు కాదని, ఎవరైనా టచ్‌లో ఉంటే వారి పేర్లు దైర్యంగా చెప్పాలి అంతే  కానీ లేనిపోని మాటలు, అసత్యం పలకడం ఏమీ బాగాలేదని  నిజంగా అలాంటి వారు ఉంటే తెలియచేయాలి అని  ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్‌ చేశారు.

 

 ప్రజల్లో సీఎం వైఎస్‌ జగన్‌పై బలమైన విశ్వాసం ఉందన్నారు. ఇలాంటి పుకార్లు చెప్పడం వల్ల మీరు సీఎం వైఎస్‌ జగన్‌పై  వున్నా నమ్మకాన్ని పోగట్టలేరు అని  రఘురామకృష్ణంరాజు అన్నారు. పరిణితి చెందిన ఏ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దూరం కారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేక గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అవి ప్రజలకుచాల వినియోగకరమని  తెలిపారు. కాగా టీ కప్పులో తుఫాన్‌లాంటి ఘటనలు జరిగాయని, తెలుగు భాషపై దుమారం చెలరేగిందని, నిన్న ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చినట్లు రఘురామకృష్ణంరాజు అన్నారు.ఈ విధంగా  సుజనా  మాట్లాడిన ఆరోపణల్లో నిజం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: