మహారాష్ట్రలో మిగిలిన రాష్ట్రాలకు భిన్నమైన రాజకీయాలు  ప్రస్తుతం నడుస్తుంటాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పాటు వ్యవహరించిన వారు లేరు. మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎవరు సీఎం పదవిని చేపట్టినా ఐదేళ్ల కాలం వరకు సీఎంగా ఉన్నవారు కూడా లేరు. .. ఉంటే రెండేళ్లు.. మహ అయితే మరో ఏడాదే తప్పించి.. ఐదేళ్లు సంపూర్ణంగా పదవీ కాలంలో పూర్తి చేసిన వారు లేరట.

 

 

కాని ఇప్పుడు మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మాటను బ్రేక్ చేశారు. ఐదేళ్ల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా.. అనూహ్యంగా సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెర మీదకు వచ్చింది. నాటకీయ పరిణామాల్లో సీఎం అయిన ఆయన పూర్తికాలం కొనసాగుతారా? అన్న సందేహాలకు తెర దించుతూ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించి... గతంలో ఎవరికి సాధ్యం కాని రికార్డు ను నెలకొల్పారు. అయితే ఇదంతా ఒక ఎత్తు .. కాని ఇప్పటివరకు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాక.. మళ్లీ ముఖ్యమంత్రి అయిన చరిత్ర మహారాష్ట్రలో ఇప్పటివరకూ లేదు.

 

 

ఆ రికార్డు ను సైతం బ్రేక్ చేశారు ఫడ్నవీస్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలు ఉంటే కేవలం 105 స్థానాల్లోనే బీజేపీ విజయం సాధించగా.. మిత్రపక్షమైన శివసేన సీఎం పదవిని కోరుకోవటంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వెనక్కి వెళ్లింది. కాగా తాజాగా ఎన్సీపీలో చీలికను తీసుకు రావటం ద్వారా అజిత్ పవార్ అండ తో దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

 

 

 

ఇలా వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యత చేపట్టిన తొలి సీఎంగా ఫడ్నవీస్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ రికార్డు మాత్రం ఇప్పట్లో మరెవరూ బ్రేక్ చేయలేరంటున్నారు. మరో వైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఫడ్నవీస్ బలనిరూపణకు గవర్నర్ ఈ నెల 30వ తేదీ వరకూ అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఏంటో ఈ రాజకీయాలు ఎప్పుడు ఎవరిని ఎలా ఈ పదవులు వరిస్తాయో చెప్పలేమను కుంటున్నారు కొందరు శివసేన కార్యకర్తలు..

మరింత సమాచారం తెలుసుకోండి: